అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషించ బోతున్న భారత్ ... ఉక్రెయిన్లో శాంతి కోసం మోడీకి జెలెన్స్కీ ఫోన్
ఉక్రెయిన్ ( Ukraine ) అధ్యక్షుడు జెలెన్స్కీ ( Volodymyr Zelensky ), భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ( Phone Conversation ) ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్లో శాంతిని పునరుద్ధరించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని జెలెన్స్కీ కోరారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని , ప్రపంచ శాంతికి సంబంధించిందని ఆయన మోడీతో అన్నారు. కాల్పుల విరమణే శాంతికి తొలి అడుగు : జెలెన్స్కీ ఉక్రెయిన్లో యుద్ధం ( War ) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ నెల రోజుల వ్యవధిలో రెండో సారి మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే కాల్పుల విరమణ కోసం రష్యాపై తేవాలని , షాంఘై సహకార సంస్థ ( Shanghai Cooperation Organization ) సదస్సులో ఈ విషయాన్ని ప్రస్తావించి రష్యాను ఒప్పించాలని కోరారు. ఉక్రెయిన్ నగరాలపై నిరంతర దాడులు జరుగుతున్నందున శాంతి చర్చలు సాధ్యం కావని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం ఆగి పోవాలంటే కాల్పుల విరమణే మొదటి అడుగని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం ( PMO ) విడుదల చేసిన ప్రకటన మేరకు , ఈ సంభాషణలో జెలెన్స్కీ , అమెరికా అధ్యక్షుడు ...