గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధి కోసం రూ. 60 కోట్ల కార్పస్ ఫండ్ విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ ఉద్యోగుల సంఘం ( TEA) రాష్ట్ర అద్యక్షులు-- ఎస్.శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో హర్షించ దగ్గ విషమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ విడుదల చేసిన నిధుల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు రూ. 10 కోట్లు కేటాయించడం సంతోషంగా వుందన్నారు. దీంతో గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసినట్లైందని కొనియాడారు. ఈ నిధులతో పాత గురుకులాల మరమత్తు పనులు , అభివృద్ధితో పాటు , కొత్త గురుకులాల్లో మౌలిక సదుపాయాలు , విద్యార్థుల వసతి గృహాలు , ల్యాబ్లు , లైబ్రరీలు , త్రాగునీటి సౌకర్యం , పరిశుభ్రత , స్మార్ట్ క్లాస్ రూంల వంటి అనేక సదుపాయాలు కల్పించ వచ్చన్నారు. ఫలితంగా గిరిజన విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన , నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యపై చూపుతున్న శ్రద్ధ , దూరదృష్టి , కృషి నిజంగా అభినందనీయమని , ఈ నిర్ణయం గిరిజన విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ...

.jpeg)
Comments
Post a Comment