కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావులేదు మున్సిపాలిటీ గెలిచి భట్టి కి కానుకగా ఇవ్వాలి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి మున్సిపల్ ఎన్నికలలో పార్టీ బీఫారం ఇవ్వడం జరుగుతుందని, పార్టీలో గ్రూపులకు తావు లేదని మధిర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మధిర మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇంచార్జి కొండా సురేఖ పేర్కొన్నారు. స్థానిక రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని, మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులను గెలిచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు కానుకగా ఇవ్వాలన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. వార్డులో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ బీ–ఫారం ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ...
Popular Posts
మున్సిపల్ తీర్పుతో విపక్షాలనోళ్లు మూత
అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల నమ్మకమే మున్సిపల్ విజయం 2047 నాటికి గ్లోబల్ హబ్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( తాళ్లూరి అప్పారావు, మధిర ) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే మున్సిపల్ ఎన్నికల విజయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నోళ్లు మూతపడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ.. అ...
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎన్ని వేల కోట్లయినా ఇస్తాం ప్రజా ప్రభుత్వంలో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం మధిరలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్, విద్యా రెండు శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని ఈ రెండు శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారని, పట్టణాల్లో ఆసుపత్రులు, విద్యావ్యవస్థ, ఎలక్ట్రిసిటీ ఈ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న పరిణామాలకు అను...

.jpeg)
Comments
Post a Comment