జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి
ఎల్.ఐ.జి , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలి అధికారులు విచారణ పూర్తి చేసి , వెంటనే ఖమ్మం ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు జరపాలి ఈ మేరకు ఖమ్మం జిల్లా డబ్ల్యూజేఐ సమావేశంలో తీర్మానాల ఆమోదం ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటం తప్పదని స్పష్టం చేసిన రాష్ట్ర నేత ఎన్.ఎస్. రావు డబ్ల్యూజేఐ సభ్యులకు జాతీయ డిజిటల్ మెంబర్షిప్ కార్డుల అందజేత ఖమ్మం: దశాబ్దాలకు పైగా గంపెడాశతో ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు , తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టులకు ఎల్.ఐ.జి , ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఖమ్మం ప్రెస్ క్లబ్ పై జరగుతున్న విచారణను తక్షణమే పూర్...