సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కమిటి సమావేశంలో రాష్ట్ర నేత ఎన్. ఎస్ రావు ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని కోరుతూ సమావేశంలో తీర్మానం యూనియన్ ప్రెస్ క్లబ్ వ్యవహారాల ఇంచార్జీగా కె. కళ్యాణ్ చక్రవర్తి నియామకం ఖమ్మం: సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డబ్ల్యూజేఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా సమాజానికి సేవ చేసిన సీనియర్ జర్నలిస్తులు, నేడు బీపీ, షుగర్ టాబ్లెట్లు కూడా కొనుక్కోలేని దుస్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నాయని, అలాగే తెలంగాణలో కూడా జర్నలిస్టులకు పెన్షన్ స్కీంను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఆదివారం ఖమ్మంలో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన జిల్లాకమిటీ సమావేశానికి ఎన్. ఎస్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్ల్యూజేఐ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోందన్నారు. సంఘాన్ని ఖమ్మం జిల్లాలో మరింత బలోపేతం చేసేందుక...