Posts

Latest Post

Image
కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావులేదు మున్సిపాలిటీ గెలిచి భట్టి కి కానుకగా ఇవ్వాలి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి  మంత్రి కొండా సురేఖ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి మున్సిపల్ ఎన్నికలలో పార్టీ బీఫారం ఇవ్వడం జరుగుతుందని, పార్టీలో గ్రూపులకు తావు లేదని మధిర   రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మధిర మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇంచార్జి కొండా సురేఖ పేర్కొన్నారు. స్థానిక రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని, మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులను గెలిచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు కానుకగా ఇవ్వాలన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.  వార్డులో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ బీ–ఫారం ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ...

చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు

Image
తొలిసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావాహులు తమ తలరాతలు మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటించిన చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు గతంలో ఉన్న రిజర్వేషన్లకు పూర్తి భిన్నంగా ఉండటంతో గతంలో ఆ అవార్డుల్లో పోటీ చేసిన వారు ప్రస్తుతం వేరే వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా చైర్మన్ పదవి కూడా గత రెండు పర్యాయాలు ఎస్సి మహిళకు రిజర్వుడ్ కాగా తొలిసారిగా జనరల్ మహిళలకు కేటాయించడంతో మధిర మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. కోర్టుల తీర్పులకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనతో మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను 11 వార్డులు రిజర్వేషన్ పోగా మరో పదకొండు వార్డులు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించారు. అయితే గతంలో జనరల్ గా ఉన్న 9,10 వార్డులు ఎస్సీలకు కేటాయించగా గతంలో ఎస్సీ కి రిజర్వుడుగా ఉన్న 11,12 వార్డులు ప్రస్తుతం జనరల్ కు మారాయి. గత ఎన్నికలలో జనరల్ గా ఉన్న13,14,15 వార్డులు ప్రస్తుతం బీసీలకు కేటాయిం...

చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు

Image
చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు మధిర అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు మంచిది క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అని పనిచేసే వారిని గెలిపించుకోవాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల వారు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను...

అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు

Image
భట్టి ప్రోద్బలంతోనే అక్రమ కేసులు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, లేదంటే ఉద్యమం ఉదృతం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రోత్బలంతోనే మధిర, బోనకల్, చింతకాని మండలాలలో పోలీసులు సిపిఎం పార్టీ కార్యకర్తలపై వాస్తవాలకి విరుద్ధంగా అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మధిర పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వెంటనే వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడు గ్రామంలో సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్న హంతకులు ఎవరో పోలీసులకు తెలిసిన తెలియనట్లు నటిస్తూ, హంతకుల కోసం కుటుంబ సభ్యులను పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధించటం ఏమిటని ప్రశ్నించారు. గడిచిన పంచాయితీ ఎన్నికల...

మధిర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ

Image
ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ విద్య టూరిజం హబ్ గా మధిర నియోజకవర్గం జీ+2 పద్ధతిలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ఘనమైన చరిత్ర కలిగిన మధిర పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో వేగవంతంగా పనులు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క మల్లు తెలిపారు. మధిర పట్టణంలో రూ 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మధిర మున్సిపాలిటి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అల్లాడుతున్న సమయంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న బొంబాయిలో 86 మంది సభ్యులతో ఆవిర్భవించిందన్నారు.   కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మధిర పట్టణ ప్రజలకు పౌర సేవలు అందించే మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు భూమిపూజ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకు స్థానిక మున్సి...
Image
ప్రజా పాలనను ప్రజలు దీవించి పట్టం కట్టారు భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు  2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్తుకు ప్రణాళికలు సిద్ధం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి 85 శాతం స్థానాలు గెలుచుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో తాజాగా గెలిచిన సర్పంచుల అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు దీవించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎవరు సర్పంచులుగా గెలిచిన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేస్తాం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ విజయ దుందుభి లో కాంగ్రెస్ కార్యకర్తల కృషి పోరాటం అద్భుతమైనదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ 8,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని డ...

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

Image
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపీచంద్ , కళ్యాణం ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్. గోపీచంద్ కళ్యాణం నాగేశ్వరావు డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక క్లబ్ కాంప్లెక్స్ ఆవరణలో టి సాంబయ్య అధ్యక్షతన  ఆ సంఘం ఏడవ మహాసభలను నిర్వహించారు. మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పెన్షనర్లు వారి సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న జిపిఎఫ్, టీఎస్ జిఎల్ఐ, ఈ ఎల్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ వెంటనే చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యం అందించాలని , వేతన సవరణ నివేదిక ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే చెల్లించాలన్నారు.  398 రూపాయల  వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ 9000 చెల్లించాలని, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ 15000 పెన్షన్ చెల్లించాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నూతనంగా సర్పంచ్ కి ఘన  సన్మాన...