Posts

Latest Post

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి

Image
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టికి డబ్ల్యూజేఐ ప్రతినిధుల వినతి  కలెక్టర్ సూచన మేరకు సమస్యలపై డీపీఆర్ఓ గౌష్ పాషాతో చర్చలు  ఖమ్మం: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (ఐ అండ్ పీఆర్) జారీ చేసిన ‘ది తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025’ లో కొన్ని నిబంధనలు జిల్లాల్లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ‘అక్రిడేషన్ కార్డులు’ పొందడంలో ఇబ్బందిగా మారాయని, వాటికి వెంటనే సవరణలు చేయాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI)ఖమ్మం జిల్లా ప్రతినిధులు కలెక్టర్  అనుదీప్ దూరిశెట్టి కి వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో అనుదీప్ దూరిశెట్టిని కలిసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. ఎస్ రావు,  ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, అమరనేని రామకృష్ణ, ఖమ్మం నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబరావు, బొడ్డుపల్లి రవీందర్ అక్రిడేషన్లు పొందడంలో చిన్న పత్రికలు, డెస్క్,ఇండిపెండెంట్, వెబ్ సైట్, కేబుల్ టీవీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.    ఈ సా...

మున్సిపల్ తీర్పుతో విపక్షాలనోళ్లు మూత

Image
అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల నమ్మకమే మున్సిపల్ విజయం 2047 నాటికి గ్లోబల్ హబ్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( తాళ్లూరి అప్పారావు, మధిర ) ​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే మున్సిపల్ ఎన్నికల విజయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నోళ్లు మూతపడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం  ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ​గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ.. అ...

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్... ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Image
జిల్లాలోని 5 మునిసిపాలిటీలలో 82.50 శాతం పోలింగ్  ఎన్నికల పోలింగ్ సరళిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి   తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో 5 మున్సిపాలిటీలలోని 116 వార్డులకు జరిగిన పోలింగ్ లో మొత్తం 82.50 శాతం ఓటింగ్ నమోదైందని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 15.37 శాతం, 11 గంటల వరకు 37.10 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 59.41 శాతం పోలింగ్ నమోదైందని, సాయంత్రం 3 గంటల వరకు 72.93 శాతం పోలింగ్ నమోదైందని, 5 గంటల వరకు 82.30 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు.  పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, మొత్తంగా ఖమ్మం జిల్లాలో 1,41,875 మంది ఓటర్లకు గాను 117043 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగా, ఇందులో 55,506 మంది పురుష ఓటర్లు, 61,520 మంది మహిళా ఓటర్లు, 17 మంది ఇతరులు ఉన్నారు. మొత్తంగా జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 82.50 ...

మునిసిపల్ పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు ... ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

Image
ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు   జిల్లాలో ఐదు మున్సిపాలిటీ లలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఫిబ్రవరి 11న నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి, కల్లూరులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలతో పాటు రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తనిఖీ చేశారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో   బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ లో వినియోగించే ఎన్నికల సామాగ్రిని పరిశీలించి, పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పివో డైరీ నింపడం, అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ ఎక్కడ తీసుకోవాలి, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీలింగ్, స్ట్రాంగ్ రూం కు తరలిం...

అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణ

Image
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎన్ని వేల కోట్లయినా ఇస్తాం ప్రజా ప్రభుత్వంలో పట్టణాల్లో ప్రశాంత వాతావరణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  ( తాళ్లూరి అప్పారావు, మధిర ) అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం మధిరలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  మున్సిపల్, విద్యా రెండు శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని ఈ రెండు శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారని, పట్టణాల్లో ఆసుపత్రులు, విద్యావ్యవస్థ, ఎలక్ట్రిసిటీ ఈ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న పరిణామాలకు అను...

మీరు గెలిపించండి ... నేను అభివృద్ధి చేస్తా

Image
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పలు వార్డుల్లో రోడ్డు షో ... పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు   గత పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా ఆనాటి ' దొర ' కు లేక పోయిందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే , తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు , ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుందని చెప్పారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ... ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటాను" అని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. రెడ్డిపల్లి ( 1 వ వార్డు) నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ముత్తగూడెం , గొల్లగూడెం , బారుగూడెం మీదుగా ఏదులాపురం , మద్దులపల్లి , తెల్దారుపల్లి వరకు కొనసాగింది. మంత్రి పొంగులేటి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు హారతులతో స్వాగతం పలకగా , పార్టీ శ్రేణ...

పారిశుద్ధ్య ఏజన్సీలకు నోటీసులివ్వండి ... ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశం

Image
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.55 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి నెలకు 55 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం నిర్వహణ జరగడం లేదని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీలకు నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పని తీరు మెరుగుపడని పక్షంలో సంబంధిత ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ డీఎంఈకు లేఖ రాయాలన్నారు. గురువారం ఆయన ఖమ్మం జనరల్ ఆసుపత్రి పని తీరు , ఆసుపత్రిలో ఉన్న పెండింగ్ పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ , మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఆసుపత్రి వైద్య అధికారులు , మున్సిపల్ , మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో పారిశుద్ధ్య సిబ్బంది హాజరు నమోదుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్. హాజరు రిపోర్ట్ ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ కోసం అవసర...