అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టికి డబ్ల్యూజేఐ ప్రతినిధుల వినతి కలెక్టర్ సూచన మేరకు సమస్యలపై డీపీఆర్ఓ గౌష్ పాషాతో చర్చలు ఖమ్మం: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (ఐ అండ్ పీఆర్) జారీ చేసిన ‘ది తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025’ లో కొన్ని నిబంధనలు జిల్లాల్లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ‘అక్రిడేషన్ కార్డులు’ పొందడంలో ఇబ్బందిగా మారాయని, వాటికి వెంటనే సవరణలు చేయాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI)ఖమ్మం జిల్లా ప్రతినిధులు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కి వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో అనుదీప్ దూరిశెట్టిని కలిసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. ఎస్ రావు, ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, అమరనేని రామకృష్ణ, ఖమ్మం నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబరావు, బొడ్డుపల్లి రవీందర్ అక్రిడేషన్లు పొందడంలో చిన్న పత్రికలు, డెస్క్,ఇండిపెండెంట్, వెబ్ సైట్, కేబుల్ టీవీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సా...