రాజీవ్ స్వగృహ ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకే .. రూ. 2 లక్షలు చెల్లిస్తే పేరు రిజిస్టర్... ప్లాట్ ధర రూ. 28 లక్షలే

Anudeep Durishetty

ఖమ్మం మున్నేరు ఒడ్డున వున్న రాజీవ్ స్వగృహలో ( జలజ టౌన్ షిప్ ) ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహపై సంబంధిత అధికార్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును 9 ఎకరాల 22 గుంటలలో నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులోని 8 టవర్లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు.  వీటి ధర గజం 1150 రూపాయల చొప్పున నిర్ణయించామన్నారు. ఇక్కడ ఉన్న 8 టవర్లు ఉద్యోగులకు లాటరీ పద్ధతిన కేటాయిస్తామన్నారు. సొంత ఇళ్ళు కావాలని ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాటరీలో పాల్గొని తమ కలను నెరవేర్చుకోవాలని సూచించారు. రివర్ వ్యూతో టవర్స్ బాగా ఉన్నాయని, త్వరగా అభివృద్ధి జరిగే ప్రాంతంలో ఈ టవర్లు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి వల్ల రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుందని, మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వరద ముంపు ఇకపై ఉండదని అన్నారు. టౌన్ షిప్ కు 60 అడుగుల రోడ్డుతో పాటు, జలజ టౌన్ షిప్ కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫ్లాట్ పొందవచ్చని పేర్కొన్నారు.

Rajiv Swagruha CE Bhashkar Reddy

నాణ్యతలో లోపం లేదు ... రూ. 28 లక్షలకే ప్లాట్ ... బ్యాంక్ రుణం పొందే అవకాశం

రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ నాణ్యతలో ఎటువంటి లోపాలు లేవన్నారు. ఆసక్తి గల ఉద్యోగులు ఫ్లాట్ కోసం రెండు లక్షల రూపాయలు చెల్లించి సెప్టెంబర్ 8న జరిగే లాటరీలో పాల్గొన్నాలని కోరారు. లాటరీ పద్దతిలో టౌన్ షిప్ అలాట్మెంట్ జరుగుతుందన్నారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ 1150 గా ధర నిర్ణయించిందని, కొనుగోలు చేసి మరో రూ. 1100 రూపాయల చొప్పున ఖర్చు చేసుకుంటే అన్ని సౌకర్యాలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. టీజీఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ మాట్లాడుతూ టౌన్ షిప్లో ఫ్లాట్ కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఉద్యోగులకు బ్యాంకర్లు రుణాలు అందించేందుకు కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఉద్యోగులు ప్రస్తుతం రెండు లక్షల రూపాయలు చెల్లించి బుక్ చేసుకుంటే తర్వాత మనకు బ్యాంకు రుణాలు దొరుకుతాయని తెలిపారు. జలజ టౌన్ షిప్లో ఇప్పటి వరకు 76 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగిలిన ఇండ్ల కోసం ఆసక్తి గలవా రు రెండు లక్షల రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ అసోసియేషన్, హౌజింగ్ బిల్డింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూములు ఇవ్వవద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా, ఉద్యోగస్తుల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం రాజీవ్ స్వగృహలో ఉన్న 576 ఫ్లాట్లను అందించాలని  నిర్ణయించామన్నారు. మొత్తం రూ. 28 లక్షలతో ఒక ఫ్లాట్ మనకు వస్తుందని, ఆసక్తి గల ఉద్యోగులు త్వరగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.

Rajiv Swagruha Meeting

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే