Posts

Showing posts from September, 2025

పాఠశాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి … అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

Image
( తాళ్లూరి అప్పారావు , మధిర ) అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాలో చేపట్టిన సమీకృత గురుకులాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే లాగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన మేధస్సుతో కూడిన మానవ వనరులను అందించడమే యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించడమే ధ్యేయంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాల మేరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని , ఆకాడమిక్ బ్లాక్ మార్చి లోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఇండోర్ , ఔట్ డోర్ ఆటలు ఆడుకునేలా డిజైన్ చేయడం జరిగిందన్నారు. ఈ గురుకులంలోనే టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో విద్యా శాఖ ఇఇ బుగ్గయ్య , బోనకల్ మండల తహసీల్దార్ రమాదేవి , సంబంధిత శాఖ...

ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు ... డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Image
( తాళ్లూరి అప్పారావు , మధిర ) స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆదరించి , ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలంగాణ ( Telangana ) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ , పథకాలు ప్రజల హృదయాల్లో ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని చెప్పారు. సోమవారం ఆయన మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ( BRS )పెద్దలు 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక , పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే , ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. రాష్ట్రంలోని రైతులు , మహిళలు , యువత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు , మనసులకు బాగా తెలుసన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని , ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చిందన్నారు. ఇంటికో ఉద్యోగం , దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఇచ్చి బీఆర్ఎస్ పెద్దలు అమలు చేయలేదన్నారు. లక్ష రూపాయల రైతు ...

ట్విట్టర్ టిల్లు ...! ముందు నీ ఇంటిని... పార్టీని చక్కబెట్టుకో !! … కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్

Image
“ నీకు విజన్ ఉందా ? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ ... ముందు నీ ఇంటిని , నీ పార్టీని చక్క బెట్టుకో... మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉంటావా... ఇండియాలో ఉంటావా అన్నది కూడా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ( Jubilee Hills by Election ) మీ పార్టీ సత్తా చూపించండి ” అంటూ  తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) కేటీఆర్ ( KTR ) కు సవాల్ విసిరారు. గురువారం ఆయన ఖమ్మం ( Khammam ) లోని వరంగల్ క్రాస్ రోడ్‌ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరగా వారికి పొంగులేటి స్వయంగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ( Congress ) పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవ లేరన్నారు. బీఆర్‌ఎస్ ( BRS ) పదేళ్ల పాటు ప్రజల కలలను ఛిద్రము చేసిందని మండి పడ్డారు. వారి హయంలో “ ఒక లక్ష ఇళ్లు ప్రతి సంవత్సరం కట్టి వుంటే ,  పది లక్షల పేద కుటుంబాలకు గ...

శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదు ... సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

Image
అణచివేతకు వ్యతిరేక పోరాటానికి మతం రంగు ముస్లిం వ్యతిరేక పోరాటంగా ఆర్ఎస్ఎస్ , బీజేపీ చిత్రీకరణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూసంస్కరణల అమలు ఏచూరి స్ఫూర్తితో శాస్త్రీయ సామ్యవాదం కోసం పురోగమిద్దాం శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదని సీపీఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మోడీ , షా , ఆర్ఎస్ఎస్ త్రిశూలంలా వ్యవహరిస్తూ మెజార్టీ ప్రజానీకాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ' తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ ' లో బేబీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన ముందుగా సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు జోహార్లు అర్పిస్తూ ఎంఏ బేబీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దున్నే వానికి భూమి , భూసంస్కరణల అమలు సాయ...

ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేయండి ... డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

Image
వారం రోజుల పాటు ఖమ్మం ( Khammam ) జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను వైద్య అధికారులు తనిఖీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) ఆదేశించారు. కనీస అవసరాలు , ట్రీట్మెంట్ , ప్రోటోకాల్ పద్ధతి , క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ , నిబంధనలు ప్రైవేట్ ఆసుపత్రులు ( P rivate Hospitals ) పాటిస్తున్నాయా ? లేదా ? అన్నది చూడాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు సరైన వైద్యం అందించని , కనీస వసతులు లేని , ప్రజల నుండి ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులను తనిఖీ చేసి రూల్స్ కు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , సీపీ సునీల్ దత్ తో కలిసి వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు , ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలతో పాటు క్లినికల్ ఎష్టాబ్లీష్మెంట్ చట్టం ప్రకారం నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పేషంట్ కు , పేషంట్ తో పాటు వచ్చే వారికి ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని , వైద్య సేవలకు , సర్జరీలకు తీసుకునే చార్జెస్ ను రాక...

చినుకు పడితే చిత్తడే

Image
మధిర లడక్ బజార్ అయ్యప్ప నగర్లో రోడ్ల దుస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తవ్వకాలతో గుంతల మయమైన రోడ్లు ( తాళ్లూరి అప్పారావు - మధిర ) మధిర ( Madhira ) పట్టణంలోని లడక బజారు అయ్యప్ప నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు వేసేందుకు రోడ్లను తవ్వి అలాగే వదిలి వేయడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్లపై గుంతలు బురద మయంగా మారడంతో నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) మధిర అభివృద్ధిలో భాగంగా రూ. 128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేశారు. ఆ పనులను చేపట్టిన సబ్ కాంట్రాక్టర్ రోడ్లను తవ్వి , అర కొరగా పనులు చేసి వదిలేశారు. ఆ తర్వాత పనులు చేపట్టిన మరో సబ్ కాంట్రాక్టర్ కూడా అసంపూర్తిగా పనులు చేసి రోడ్లకు మరమ్మతులు చేయ లేదు. దీంతో వర్షం పడితే ఆ రోడ్లన్నీ బురద మయంగా మారి నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. రోడ్లు మాగాణి భూముల్లా మారడంతో ఆ ప్రాంత విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం కూడా కష్టమవుతోంది. అంతే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వేసేందుకు రోడ్లు తవ్విన సమయంలో త్రాగు నీటి పైపులు పగి...

ఆధ్యాత్మిక పర్యటనకు ప్రత్యేక రైలు

Image
( తాళ్లూరి అప్పారావు - మధిర ) దక్షిణ భారత దేశ ఆలయాల వైభవాన్ని చూసి తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) ప్రత్యేక పర్యాటక రైలును ఏర్పాటు చేసినట్లు ఐ . ఆర్ . సి . టి . సి ( IRCTC ) టూరిజం ( T ourism )  అసిస్టెంట్ మేనేజర్ పి . వి వెంకటేష్ తెలిపారు. సోమవారం మధిర రైల్వే స్టేషన్లో ( Madhira Railway Station ) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ( Telugu States ) ప్రజల కోసం ఈ నెల 23 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు దివ్య దక్షణ యాత్ర జ్యోతిర్లింగం ( Divya Dakshana Yatra Jyothirlingam ) పేరుతో దక్షిణ భారత దేశ వైభవాన్ని ప్రతిబింబించే ఏడు పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేలా యాత్రను రూపొందించినట్లు పేర్కొన్నారు. యాత్రలో తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం , రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం , మధురై లోని మీనాక్షి అమ్మన్ ఆలయం , కన్యాకుమారిలోని కుమారి అమ్మన్ ఆలయం , తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం , తిరుచిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం , తంజావూరులోని బృహదీశ్వర ఆలయం వరకు ఈ దివ్య దక్షణ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ఈ రైలు 23 వ తేదీన సిక...

సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలక పాత్ర … అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని

Image
( తాళ్లూరి అప్పారావు , మధిర ) సమాజాభివృద్ధిలో జర్నలిస్టులది కీలక పాత్రని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhtti Vikramarka ) సతీమణి , అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని అన్నారు. ఆదివారం స్థానిక పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మధిర ప్రెస్ క్లబ్ ( Press Club ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి , వాటికి పరిష్కారం చూపడంలో జర్నలిస్టుల ది కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు విలువలతో కూడిన వార్తలను ప్రజలకు అందించినప్పుడే విశ్వసనీయత పెరుగుతుందన్నారు. మల్లు భట్టి విక్రమార్క గెలుపుకు మధిర నియోజకవర్గ జర్నలిస్టులు ( Journalists ) తనకు ఎంతో సహకరించారని , వారి సహకారాన్ని ఎప్పుడూ మరవమన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని  ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.  నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కు , జర్నలిస్టులకు వ్యక్...

గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ... డిప్యూటీ సీఎం భట్టి

Image
జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం మోడల్ నియోజక వర్గంగా మధిర అభివృద్ధి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు   భట్టి విక్రమార్క ఎర్రుపాలెం మండలంలో సుడి గాలి పర్యటన పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు ( తాళ్లూరి అప్పారావు , మధిర ) గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం , రాష్ట్ర ఆర్థిక , ఇంధన శాఖల మంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం ఆయన మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు , పెద్ద గోపవరంలో రూ. 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు , పెద్ద గోపవరం ఎస్సీ కాలనీలో రూ. 85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు , బుచ్చిరెడ్డి పాలెం ఎస్సీ కాలనీలో రూ. 40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు , బనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో రూ. 1. 75 కోట్లతో నిర్మించనున్న అంతర్...

గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Image
తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) గ్రూప్-1 ( Group -1 ) పరీక్ష ఫలితాలపై కీలక తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు ( Justice Namavarapu Rajeswara Rao ) , గతంలో ప్రకటించిన ఫలితాలను రద్దు చేస్తూ , వాటిని తిరిగి మూల్యాంకనం చేయాలని (రీ-వాల్యుయేషన్) ఆదేశించారు. ఒక వేళ రీ-వాల్యుయేషన్ సాధ్యం కాక పోతే , పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేశారు. తీర్పులోని ముఖ్యాంశాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (  TGPSC ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై కొంత మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా , మరి కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తైనందున రద్దు చేయ వద్దని కోరారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు విచారించి , తాజాగా ఈ తీర్పు వెలువరించింది. ఫలితాల రద్దు , రీ-వాల్యుయేషన్: హైకోర్టు గతంలో విడుదలైన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసింది. దీనికి బదులుగా , ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్ష పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని TGPSC ని ఆదేశించింది. కొత్త ర్యాంకులు: రీ-వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత వచ...

బీఆర్ఎస్ బాటలోనే బీజేడీ

Image
ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఒడిశాకు చెందిన ప్రముఖ ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్ (  BJD ) నిర్ణయించింది. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి (  BRS ) ఇదే బాటలో నడుస్తుండగా , తాజాగా BJD కూడా వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర ఢిల్లీలో వెల్లడించారు. రేపు జరిగే పోలింగ్‌లో తమ పార్టీ ఎంపీలు ఎవరూ పాల్గొనరని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ ఎంపీలు , రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించిన అనంతరం , పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ తుది నిర్ణయం తీసుకున్నారని సస్మిత్ పాత్ర తెలిపారు. భారతీయ జనతా పార్టీ (  BJP ) నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (  NDA ) కూటమికి , కాంగ్రెస్ ( Congress ) సారథ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (  INDIA ) కూటమికి సమాన దూరం పాటించాలనే తమ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఒడిశా రాష్ట్ర అభివృద్ధి , 4.5 కోట్ల మంది ప్రజల సంక్షేమంపైనే తమ పూర్తి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బిజూ జనతాదళ్‌కు ఏడుగురు సభ్య...

జూన్ లోగా మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి ... మంత్రి తుమ్మల

Image
అభివృద్ధి పనుల్లో వేగం పెంచి , నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , సహకార , చేనేత , జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అధికార్లను ఆదేశించారు. సోమవారం ఆయన ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలసి మున్నేరు రిటైనింగ్ వాల్ , కేబుల్ బ్రిడ్జి , ఖిల్లా రోప్ వే పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు.  ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూమున్నేరు వరదల నుండి నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా మున్నేరు ( Munneru ) కు ఇరు వైపులా రూ. 690 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. 17 కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 6.4 కిలో మీటర్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగులు భూ సేకరణ ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. నదికి ఇరు వైపులా పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. గత వరదల్లో జరిగిన నష్టం మళ్ళీ జరగొద్దని , వచ్చే జూన్ లోపే నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 53 శాతం పూర్తైన కేబుల్ బ్రిడ్జి అలాగే కేబుల్ బ్రిడ్జి ( Cable Bridge ) నిర్మ...

రూ. 87.41 కోట్లకు రాజీవ్ స్వగృహ విక్రయం

Image
ఖమ్మం ( Khammam ) మున్నేరు ( Munneru ) ఒడ్డున గల రాజీవ్ స్వగృహను ( జలజ టౌన్ షిప్ ) అమ్మేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ సోమవారం ముగిసింది. సుమారు 9.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 8 టవర్లను తెలంగాణా ( Telangana ) గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకార గృహ నిర్మాణ సంఘం   రూ. 87.41 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ టౌన్ షిప్ విక్రయానికి రెండు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల ఉద్యోగ సహకార సంఘాలు , బిల్డర్లు , డెవలపర్స్ , గ్రూప్ హౌసింగ్ పై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. రూ. 5 కోట్ల ఇఎండీగా నిర్ధారించారు. చదరపు గజానికి నామ మాత్రంగా రూ. 1150 ధరను నిర్ణయించి , ఒకటి   కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా కేటాయించాలనుకున్నారు. అందులో భాగంగా సోమవారం అధికారుల సమక్షంలో నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకున్న తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు రాజీవ్ స్వగృహను కేటాయించినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం ( V.P Gowtham ) తెలిపారు. ఏదులాపురం ( Edulapuram ) మున్సిపల్ పరిథిలోని పోలేపల్లిలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 576 ఫ్లాట్...

'బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ' ... కామారెడ్డిలోనే ఎందుకు?

Image
తెలంగాణ ( Telangana ) లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని , కాంగ్రెస్ ( Congress ) పార్టీ బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ నెల 15న కామారెడ్డి లో ' బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ' ను నిర్వహించనుంది. ఈ సభ నుంచే స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. కారణం ఇదే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి అప్పటి సీఎం కేసీఆర్‌ ( KCR ) పై రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పోటీ చేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుల గణన చేసి , బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ , రాష్ట్రంలో కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను ( BC Reservation ) 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఏ వేదికపై అయితే హామీ ఇచ్చారో , ...

ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా ... కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు డబ్బులు పంపారని ఆరోపణ

Image
ఎమ్మెల్సీ పదవికి , బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ పార్మెట్లో రాజీనామా చేసి పంపుతున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వానికి సంబంధిత పార్టీ వర్గాల ద్వారా కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె బుధవారం తొలి సారి మీడియా ముందుకు వచ్చి ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని హస్త గతం చేసుకొనే కుట్రలు జరుగుతున్నాయని , కుట్రలు పట్ల అప్రమత్తంగా వుండాలని కేటీఆర్ , కేసీఆర్ లను హెచ్చరించారు. ఇవ్వాళ తనకు ఎదురైన పరిస్థితే , రేపు మీకు ఎదురు కావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. హరీష్ రావు , సంతోష్ రావులను నమ్మొద్దని , పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరకు చెర దీయాలని సూచించారు. గత ఎన్నికల్లో కేటీఆర్ ను ఓడించడం కోసం హరీష్ రావు రూ. 60 లక్షలు పంపారని తీవ్రమైన ఆరోపణ చేశారు. అలాగే 25 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులకు సొంతగా డబ్బులు ఇచ్చారని చెప్పారు. ఈ డబ్బులు హరీష్ రావుకు ఎక్కడవని ఆమె సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డబ...

ఈ ముగ్గురు నేతల బంధం ఎలా ఉందంటే ...

Image
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ), చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ( Jinping ) ల మధ్య పెరుగుతున్న స్నేహం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు నాయకుల కలయిక వెనుక డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) అనుసరించిన దూకుడు విధానాలే కారణమని అమెరికా ( America ) మీడియా విమర్శిస్తోంది. ట్రంప్ సొంత నిర్ణయాలే ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయని అభిప్రాయపడింది. షాంఘై సహకార సంస్థ ( SCO ) సదస్సులో మోదీ , పుతిన్ , జిన్‌ పింగ్‌లు చాలా సన్నిహితంగా కనిపించారు. వారు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు , వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. పుతిన్ కారులో మోదీ ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పరిణామాలను అమెరికన్ మీడియా లోతుగా విశ్లేషించింది. అమెరికా మీడియా దృక్కోణం ది న్యూయార్క్ టైమ్స్: అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ ముగ్గురు నాయకులు ఒక కూటమిగా ఏర్పడుతున్నారని ' ది న్యూయార్క్ టైమ్స్ ' పేర్కొంది. సీఎన్ఎన్: SCO సదస్సు ద్వారా అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఈ నేతలు ఒక సవాలు విసిరారని ...

కవిత దారెటు ?

Image
బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తెలంగాణలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కవిత తదుపరి అడుగులు ఎటు వైపు వేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. ఆమె మరో పార్టీలో చేరుతారా ? లేదా సొంతంగా కొత్త పార్టీ పెడతారా ? అన్నదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీలో చేరే అవకాశమెంత ? కవిత బీజేపీలో చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే , గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని ఆరోపిస్తూ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో , ఆమె బీజేపీలో చేరితే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవచ్చనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌ ద్వారాలు తెరుస్తుందా ? కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా సాధ్యం కాదనే వాదన బలంగా ఉంది. నిన్ననే , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , హరీష్ రావు , సంతోష్ రావుల వెనకుండి కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బురద జల్లుతున్నారని ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో ఆమెకున్న వైరుధ్యాన్ని స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదనేది రాజకీయ పరిశీలకుల అం...