బీఆర్ఎస్ బాటలోనే బీజేడీ

Vice President Elections 2025

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఒడిశాకు చెందిన ప్రముఖ ప్రాంతీయ పార్టీ బిజూ జనతాదళ్ ( BJD ) నిర్ణయించింది. ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి ( BRS ) ఇదే బాటలో నడుస్తుండగా, తాజాగా BJD కూడా వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర ఢిల్లీలో వెల్లడించారు. రేపు జరిగే పోలింగ్‌లో తమ పార్టీ ఎంపీలు ఎవరూ పాల్గొనరని ఆయన స్పష్టం చేశారు.

ఈ అంశంపై పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీతో చర్చించిన అనంతరం, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ తుది నిర్ణయం తీసుకున్నారని సస్మిత్ పాత్ర తెలిపారు. భారతీయ జనతా పార్టీ ( BJP ) నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ( NDA ) కూటమికి, కాంగ్రెస్ ( Congress ) సారథ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ ( INDIA ) కూటమికి సమాన దూరం పాటించాలనే తమ పార్టీ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఒడిశా రాష్ట్ర అభివృద్ధి, 4.5 కోట్ల మంది ప్రజల సంక్షేమంపైనే తమ పూర్తి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బిజూ జనతాదళ్‌కు ఏడుగురు సభ్యులు ఉన్నారు.

రేపు జరగనున్న ఎన్నికల్లో NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ( CP Radha Krishnan ), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ( Justice Sudarshan Reddy ) బరిలో ఉన్నారు. రెండు ప్రధాన కూటములకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే