ఈ ముగ్గురు నేతల బంధం ఎలా ఉందంటే ...
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin ), చైనా అధ్యక్షుడు జిన్ పింగ్( Jinping ) ల మధ్య పెరుగుతున్న స్నేహం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు నాయకుల కలయిక వెనుక డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) అనుసరించిన దూకుడు విధానాలే కారణమని అమెరికా ( America ) మీడియా విమర్శిస్తోంది. ట్రంప్ సొంత నిర్ణయాలే ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయని అభిప్రాయపడింది. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోదీ, పుతిన్, జిన్ పింగ్లు చాలా సన్నిహితంగా కనిపించారు. వారు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. పుతిన్ కారులో మోదీ ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పరిణామాలను అమెరికన్ మీడియా లోతుగా విశ్లేషించింది.
అమెరికా మీడియా దృక్కోణం
ది న్యూయార్క్ టైమ్స్: అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ
ముగ్గురు నాయకులు ఒక కూటమిగా ఏర్పడుతున్నారని 'ది న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.
సీఎన్ఎన్: SCO సదస్సు ద్వారా అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఈ నేతలు ఒక సవాలు
విసిరారని 'సీఎన్ఎన్' అభిప్రాయపడింది.
ఫాక్స్ న్యూస్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ట్రంప్
భారత్పై సుంకాలు విధించారు. వాషింగ్టన్కు గట్టి హెచ్చరిక పంపేందుకే మోదీ ఈ
సమావేశాలకు హాజరయ్యారని 'ఫాక్స్ న్యూస్' విశ్లేషించింది.
ది వాషింగ్టన్ పోస్ట్: "భారత్తో ట్రంప్ వైరం ఎదురు తిరగవచ్చు"
అనే శీర్షికతో 'ది
వాషింగ్టన్ పోస్ట్' ఒక
సంపాదకీయం ప్రచురించింది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్: ట్రంప్ అసాధారణ విధానాల వల్ల అమెరికా
ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఐక్యతా ప్రదర్శన నొక్కి చెబుతోందని 'ది వాల్ స్ట్రీట్
జర్నల్'
పేర్కొంది.
.jpeg)
Comments
Post a Comment