'బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ' ... కామారెడ్డిలోనే ఎందుకు?

BC Declaration Victory Meeting

తెలంగాణ ( Telangana ) లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కాంగ్రెస్ ( Congress ) పార్టీ బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ నెల 15న కామారెడ్డిలో 'బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ' ను నిర్వహించనుంది. ఈ సభ నుంచే స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కారణం ఇదే

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి అప్పటి సీఎం కేసీఆర్‌ ( KCR )పై రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పోటీ చేశారు. ఆ సమయంలో కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుల గణన చేసి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ, రాష్ట్రంలో కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను ( BC Reservation ) 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఏ వేదికపై అయితే హామీ ఇచ్చారో, అదే వేదికపై నుంచి ఈ విజయోత్సవ సభ నిర్వహించడం ద్వారా బీసీ వర్గాలకు ఒక బలమైన సందేశాన్ని పంపవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

సభకు హాజరుకానున్న అగ్ర నాయకులు

ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. లక్ష మందికి పైగా జన సమీకరణ చేసి, ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సభ ఏర్పాట్లపై ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొని జనసమీకరణ, సభా ఏర్పాట్లపై చర్చించారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే