సీఎంఆర్ఎఫ్ క్రింద రూ. 1070 కోట్ల ఆర్థిక సహాయం

రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి 71 మంది లబ్ధిదారులకు రూ. 23 . 33 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 35 మందికి ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో 1070 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన కూసుమంచి క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 23 లక్షల 33 వేల రూపాయలు , 35 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయల చొప్పున కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేద వాడికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఆనాడు పాలించిన పాలకులు 10 సంవత్సరాలలో వైద్యం పట్ల ఎప్పుడూ తామిచ్చిన నిధులు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్ర...