Posts

Showing posts from June, 2025

ఇక్కడ ఎంత మంది మంత్రులున్నా ... రేణుక కూడా వుంటుంది

Image
  నేను ఈ జిల్లా ఆడ బిడ్డను ... వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు మావోయిస్టులతో కేంద్రం చర్చలెందుకు జరపడం లేదు ? కేంద్రం కుట్రతో బనకచర్ల నిర్మాణానికి సన్నాహాలు బీఆర్ఎస్ , బీజేపీల మధ్య రహస్య బంధం కొనసాగుతోంది కవిత పర్యటనలకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి ?   కేంద్ర మాజీ మంత్రి , రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఎంత మంది మంత్రులు ఉన్నా ... రేణుక కూడా ఖమ్మంలోనే ఉంటుందని మాజీ కేద్ర మంత్రి , రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఈ జిల్లా ఆడ బిడ్డను , జిల్లాను వదిలి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. జిల్లాలో తన సత్తా అంటే ఏంటో చూపిస్తానని ఉద్ఘాటించారు. తన పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె , స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీజ్ ఫైర్తో పాక్ , మిజోరాంతో చర్చలు జరిపిన కేంద్రం , మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. పక్కదేశాలైన నేపాల్ , చైనాలతో ప్రమాదం పొంచి ఉందని , దానిని కేంద్రం నివారించడం లేదన్నారు. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించమంటే , నిర్వహించడం లేదని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కాం...

ఛలో పూసుగూడెం ... ఉద్రిక్తం

Image
  బీఆర్ఎస్ నేతలు రేగా , వనమా , హరిప్రియ , మెచ్చ , రాకేశ్ రెడ్డి అరెస్ట్ ‘ సీతరామ ’ నీళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఆందోళనలో భాగంగా ప్రభుత్వానికి పిండ ప్రధానం చేసేందుకు ప్రయత్నం నేతల ప్రయత్నాలను అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు నీళ్లిచ్చే వరకు దశల వారీ ఆందోళనలు చేపడతామని నేతల హెచ్చరిక     ‘ సీతారామ ’ ( గోదావరి ) నీళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చిన తర్వాతే , ఖమ్మం జిల్లాకు తరలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆ జిల్లా బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ‘ ఛలో పూసుగూడెం ’ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో భాగంగా నేతలెవరూ ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెంలో   వున్న   ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు , మాజీ మంత్రి వనమా వేంకటేశ్వర రావు , మాజీ ఎమ్మెల్యే హరిప్రియ , నాయకులు రాకేశ్ రెడ్డి , దిండిగల రాజేందర్ , వనమా రాఘవేంద్రలను దారిలోనే అదుపులోకి తీసుకొని పాల్వంచ పోలీసు స్టేషన్ కు తరలించారు. అలాగే , మరో మాజీ ఎమ్మెల్యే మెచ్చ ...

ఫేక్ కాల్స్ నమ్మి ఎవరు డబ్బులు చెల్లించ వద్దు

Image
ట్రెడ్ లైసెన్స్ కోసం ఫోన్ కాల్స్ చేయడం లేదు ప్రజలు , వ్యాపారులు అప్రమత్తంగా వుండాలి ఖమ్మం కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ నుండి ట్రెడ్ లైసెన్స్ కు సంబంధించి ఎటువంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో వస్తున్న ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని పెద్ద పెద్ద భవనాలు , ఆసుపత్రులు , వాణిజ్య వ్యాపారవేత్తలకు 9346423925 నెంబర్ తో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుండి చేసినట్లుగా ఫేక్ ఫోన్ కాల్స్ చేసి , ట్రేడ్ లైసెన్స్ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు , వ్యాపారులెవరూ ఎటువంటి ఫోన్ కాల్స్ ను పట్టించు కోవద్దని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఫోన్ కాల్స్ ద్వారా బిల్లుల సేకరణ జరగదన్నారు. ఫేక్ కాల్స్ నమ్మి ఎవరు డబ్బులు చెల్లించి మోస పోవద్దని , ఇటువంటి ఫోన్ కాల్స్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ అభిషేక్ అగస్త్య ఆ ప్రకటనలో హెచ్చరించారు.

మున్నేరు రిటైనింగ్ వాల్ ... డైలీ షెడ్యూల్ ఎక్కడ మిస్సైంది ?

Image
  డెడ్ లైన్ దగ్గర పడుతున్నా పూర్తి కాని పనులు ఎర్త్ వర్క్ 41 శాతం , సిమెంట్ వర్క్ 32 శాతం పూర్తి జులై 15 నాటికి పూర్తయ్యే అవకాశాలు మృగ్యం   పనులకు అవరోధంగా మారిన భూ సేకరణ ప్రక్రియ వరదోస్తే బాధితుల తరలింపుకు అధికారుల సమాయత్తం   ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంపు నుండి రక్షించేందుకు నిర్మించ తల పెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. భూసేకరణ వద్దే కునుకు పాట్లు పడుతోంది. ఇద్దరు మంత్రులు ఇటు తుమ్మల , అటు పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి , సందర్శించి నిర్మాణ పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేసినా , అంతగా పురోగతి కనిపించడం లేదు. ఇంతలో వానా కాలం రానే వచ్చింది. గత రెండేళ్లుగా వచ్చినట్లే ఈ ఏడాది కూడా మున్నేరుకు భారీ వరదొస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ప్రస్తుతం అధికార్లు వున్నారు. ఇప్పటి నుండే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేసినా , ఈ సీజన్లో పూర్తైయ...

100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకోవాలి

Image
  పెట్రోలింగ్ , బ్లూ కోల్డ్స్ వాహనాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశం 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత అధికార్లను ఆదేశించారు. శనివారం ఆయన అశ్వాపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు , సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని , వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేసే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పని చేసే అధికారులు , సిబ్బంది...

ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగితే శిక్ష తప్పదు

Image
  కేంద్రం సహాయం చేస్తున్నా ఇందిరమ్మ పేరు పెట్టడం వారి విజ్ఞత 3.04 లక్షల ఇండ్లు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్ట లేక పోయింది రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి , తెలివీ బీజేపీకి మాత్రమే వున్నాయి ఖమ్మం మీడియా సమావేశంలో బీజేపీ నేత ఈటల రాజేందర్   ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా , అమ్ముకున్నా పనిష్మెంట్ వుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు , మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లబ్దిదారులకు ఏ ప్రాతిపదికన ఇండ్లు కేటాయిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన వుందన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలవుతున్న ఈ పథకానికి ‘ ఇందిరమ్మ ’ పేరు పెట్టడాన్ని పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఆ మాత్రం సంస్కారం రాష్ట్ర పాలకులకు లేక పోయినా , కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదల ఇండ్ల కోసం సహాయం అందిస్తూనే వుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజీపీ ప్రభుత్వం లేదని , కేంద్రం ఇక్కడి పేదలను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రం 3.04 లక్షల...

ఖమ్మంలో పారిశుధ్య నిర్వహణకు 100 రోజుల ప్రణాళిక

Image
  పరిశుభ్రమైన నగరంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం నగరంలో పారిశుద్య నిర్వహణకు 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ , చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. అందులో భాగంగా వానలు రాక ముందే కార్పోరేషన్ అధికారుల ప్రత్యేక చొరవతో కాల్వలో మురుగు నీరు నిల్వ ఉండకుండా , ఎక్కడా చెత్త పేరుకు పోకుండా , దుర్గందం రాకుండా 20 రోజులుగా నగరంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఖమ్మాన్ని పరిశుభ్రమైన నగరంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన నగర మేయర్ పునుకొల్లు నీరజ , నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి వరదయ్య నగర్లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి చెత్తను రోజూ సేకరిస్తున్నట్లు చెప్పారు. రోడ్లు , డ్రైయిన్లలో చెత్త వేయవద్దని కోరారు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం , మన పిల్లలు ఆరోగ్యంగా వుంటారని అన్నారు. ఖమ్మం నగర మేయర్ ప...

మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Image
  భూ నిర్వాసితులతో చర్చలు జరపాలి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్ర స్థాయిలో వాల్ నిర్మాణ పనుల పరిశీలన  ఖమ్మం వద్ద మున్నేరు నదికి ఇరు వైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికార్లను ఆదేశించారు. మంగళవారం ఆయన అధనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి , భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని   క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ కరుణగిరి , రాజీవ్ గృహకల్ప , పోలేపల్లి వద్ద రిటైనింగ్ వాల్ , డ్రెయిన్ , రోడ్డు నిర్మాణాలు , పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికార్లను అడిగి తెలుసుకున్నారు. ఎర్త్ వర్క్ 41 శాతానికి పైగా , సిమెంట్ కాంక్రీట్ పనులు 32 శాతం మేర పూర్తయినట్లు అధికార్లు తెలిపారు. నగరం నుండి వివిధ డ్రెయిన్ల నుండి వచ్చే వరద నీటి నిర్వహణను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి   మాట్లాడుతూ   మున్నేరు నదికి ఇరు వైపులా ఎనిమిదిన్నర కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్...

ఏ ఎన్నిక వచ్చినా వీరిని దీవించండి

Image
  గత ప్రభుత్వ మంచి పథకాలను కొనసాగిస్తున్నాం అప్పులు తీరుస్తూ కొత్త పథకాలు తీసుకు వచ్చాం పేదలకు అండగా వుండాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశ్యం తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం తరుపున నిలబడే అభ్యర్థులను దీవించాలని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట నియోజక వర్గంలోని చండ్రుగొండ , అన్నపురెడ్డి పల్లి , ములకల పల్లి   మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సీసీ రోడ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. ఆయా సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం , ఏడాదిన్నర కాలంలో గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను అమలు చేస్తూనే , పేదవాడి కళ్లలో ఆనందాన్ని చూడాలని అనేక అభివృద్ధి , సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రం సుమారు రూ. 8.19 లక్షల కోట్ల అప్పులో ఉన్నప్పటికీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత...

మావోలు లొంగి పోవడమే మేలు

Image
తెలంగాణలో మావోయిస్టులకు స్థానం లేదు కాదని సంచరిస్తే పోలేసుల నుండి తప్పించుకో లేరు   అగ్ర నేతలు లొంగి పోతే పునరావాసానికి ప్రత్యేక చర్యలు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ప్రకటన ఎస్పీ ఎదుట లొంగి పోయిన 12 మంది మావోయిస్టులు నిషేధిత మావోయిస్టులు చావో రేవని పోరాడడం కన్నా లొంగి పోవడం మేలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హితవు పలికారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు , రాష్ట్ర నాయకులు తక్షణమే లొంగి పోయి , జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో మావోయిస్టులకు తావు లేదని , ఎవరైనా ఈ ప్రాంతంలో సంచరిస్తే , పోలీసు బలగాల నుండి తప్పించుకొనే అవకాశమే లేదని హెచ్చరించారు. కర్రె గుట్టల్లో 31 మంది మావోలు ప్రాణాలు కోల్పోవడాన్ని మారువ కూడదన్నారు. గురువారం నిషేధిత మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న 12 మంది కొత్తగూడెంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగి పోయారు. వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికీ రూ. 25 , 000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ , చత్తీష్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు...

వచ్చిన వాకిటి ... వెళ్ళారెందుకు ?

Image
ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి పర్యటనపై చర్చ భట్టి పర్యటన , సమీక్షా సమావేశంలో పాల్గొన కుండానే వెళ్లడంపై ఊహాగానాలు ముగ్గురు మంత్రులతో కలిసి మరో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామన్న వాకిటి డిప్యూటీ సీఎం భట్టిని కలవడానికి మాత్రమే ఖమ్మం వచ్చానని క్లారిటీ   ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి   ఖమ్మం పర్యటనపై చర్చ జరుగుతోంది . బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన జిల్లా అధికార్లు , ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరు కాకుండానే , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వెళ్ళి పోయారు. పోతూ పోతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రిగా తనను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు తెలిపానని , డిప్యూటీ సీఎం భట్టి   ఖమ్మం పర్యటనలో ఉన్నారని తెలుసుకొని హైదరాబాద్ నుంచి   వచ్చి మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. త్వరలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులను సంప్రదించిన తర్వాత , ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అయితే , ఖమ్మం వరకూ వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి , డిప్యూటీ సీఎం భట్టి , మరో మంత్ర...

కాంగ్రెస్ అంటేనే కరెంటు ... కరెంటు అంటేనే కాంగ్రెస్

Image
పదేళ్లలో గత పాలకులు కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించడమే తప్ప ఏదీ పూర్తి చేయ లేదు రాబోయే 10 ఏళ్ల విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రణాళికలు ఉచిత విద్యుత్ పథకాలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 13,992 కోట్లు చెల్లిస్తుంది విద్యుత్ సమస్యల   పరిష్కారానికి విద్యుత్ అంబులెన్స్ లు ( 1912 ) విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కరెంటు అంటేనే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటేనే కరెంటని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో 1912 విద్యుత్ అంబులెన్స్ సేవలు , విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరాలను రవాణా , బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ , టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్ సీఎండి  కె. వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశామని చెప్పారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని మొదటి దశ నుంచి ఏడవ దశ వరకు కాంగ్రెస్ ప్రభుత...