Posts

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వం

Image
  సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు ఈ నెల 19న లగచర్లకు పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం బసుల తగ్గింపుకుపై 4న డిపోల ఎదుట ఆందోళనలు కగార్ పేరుతో కేంద్రం బూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు వుండబోదని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ , స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి గానే పోటీ చేస్తామన్నారు. ఒక వేళ వామ పక్ష పార్టీలు ముందుకు వస్తే కలసి పోటీ చేస్తామని చెప్పారు. మాస్ లైన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నవంబర్ 14 , 15 , 16 తేదీలలో ఖమ్మంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పోటు రంగారావు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఫార్మ కంపెనీల ప్రయోజనాలకు అనుకుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. వెంటనే వికారాబాద్ జిల్లా లగచర్ల తదితర గ్రామాలపై పోలీసుల దాడులు , అక్రమ అరెస్టులు ఆపాలని , రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రంగారావు డిమాండ్ చేశారు.   రైతులు తమ భూముల రక్షణ కోసం చేసిన పోరాటాన్ని సీపీఐ (ఎం-ఎల్) మాన్లైన్ బలపరుస్...

కాంగ్రెస్లో ‘ కొత్త ’ పంచాయితీ

Image
జిల్లాలో నివురు గప్పిన నిప్పులా ఆధిపత్య పోరు పాత , కొత్త నేతల మధ్య పొడ చూపుతున్న విబేధాలు సర్పంచ్ అభ్యర్ధులుగా పలు గ్రామాల్లో సెల్ఫ్ డిక్లరేషన్లు   గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తల నొప్పిగా మారే అవకాశం కాంగ్రెస్లో ‘ కొత్త ’ పంచాయితీ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత , కొత్త కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరు సాగుతోంది. కొంత కాలంగా ఈ పోరు చడీ చప్పుడు లేకుండా నడుస్తున్నప్పటికీ , తరచూ అక్కడక్కడ వర్గ విబేధాలు పొడ చూపుతూనే వున్నాయి. ఈ విభేధాలు కాస్త , గ్రామ పంచాయితీ ఎన్నికల నాటికి ఆదిపత్య పోరుగా మారే అవకాశ వుంది. పార్టీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకులు. ఎంపీ రేణుకా చౌదరి , మాజీ మంత్రి సంబాని చంద్ర శేఖర్ కూడా కొంత ప్రభావం చూపగలరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరులున్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎవరి వర్గం వారి కుంది. పాలేరుకు మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా భద్రాచలం , పినపాక , ఇల్లందు , అశ్వరావు పేట అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆయన ప్రధాన అనుచరులు తెల్లం వ...

భద్రాచలం కాంగ్రెస్ లో బగ్గుమన్న విబేధాలు

Image
          వీధిన పడ్డ పోదెం , తెల్లం వర్గాల మధ్య ఆధిపత్య పోరు         దుమ్ముగూడెం మండలంలో తెల్లానికి వ్యతిరేకంగా ప్లెక్షీలు       ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుతో బయట పడ్డ అసంతృప్తి ఒక్క సారిగా భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే , రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య , స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మధ్య కొంత కాలంగా ఏర్పడ్డ అగాధం కాస్త , వివాదంగా మారి వీధిన పడింది. దుమ్ముగూడెం మండలంలోని ములక పాడు సెంటర్ , నర్సాపురం , లక్ష్మీ నగరంలో ఎమ్మెల్యే తెల్లంకు వ్యతిరేకంగా ప్లెక్షీలు వెలిశాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమక్షంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ పలు చోట్ల ప్లెక్షీలు పెట్టారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికే ఇందరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకూ నివురు గప్పిన నిప్పుగా వున్న వర్గ పోరు , ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సందర్భంగా బగ్గు మనడం భద్రాచలం నియోజక వర్గంలో ఇప్పు...

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి

Image
            పోలీసుల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు         గంజాయి సేవించే వారిపైనా కేసులు పెట్టాలని ఆదేశం           సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన     మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా వుంటూ ,  వారి కదిలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో నెల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గుట్కా , మట్కా , జూదం , బెట్టింగు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి , చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల...

ఈ గోడ ఎక్కడి వరకు ?

Image
          40 ఏళ్లలో మున్నేటికి ఎన్నడూ లేనంత వరద           రక్షణ గోడల డిజైన్ మార్చే పనిలో అధికారులు          దంసలాపురం వరకూ నిర్మించాలంటున్న బాధితులు ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంపు నుండి కాపాడేందుకు ప్రభుత్వం రక్షణ గోడలు నిర్మిస్తోంది. పోలేపల్లి నుండి ప్రకాష్ నగర్ వరకూ 7.5 కిలో మీటర్ల మేర ఏటికి ఇరు వైపులా ఈ గోడలు నిర్మిస్తున్నారు. కానీ , సెప్టెంబర్ 2న మున్నేటికి వచ్చిన భారీ వరద , రక్షణ గోడల నిర్మాణానికి అధికారులు గతంలో వేసిన అంచనాలను , రూపొందించిన ప్రతి పాదనలను తల్ల క్రిందులు చేసింది. కొత్త అంచనాలను , ప్రతి పాదనలను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. తాజాగా మున్నేరు కొచ్చిన వరదకనుగుణంగా నిపుణులు , జిల్లా అధికారులు తిరిగి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న వందేళ్ళలో వరదల వల్ల నగరానికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా రక్షణ గోడలను రీడిజైన్ చేస్తున్నారు. ఎప్పటి కప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందుకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే , ఇప్పుడు కొత్త డిమాండ్ ఒకటి తెర పైకి వచ...

సీతారామను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలి

Image
  యాతాలకుంట టన్నెల్ పనులు శరవేగంగా చేపట్టాలి నిర్ణిత గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి భూసేకరణలో అలసత్వం వహించ వహించ వద్దు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ , పొంగులేటి   సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ , కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయ శాఖా , మంత్రి మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు మేరకు జల సౌదలో   సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రులు తుమ్మల , పొంగులేటితో కలసి నీటి పారుదల శాఖాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యాతాల కుంట టన్నెల్ పనులను శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ పంప్ హౌజ్లను ప్రారంభించామని , మిగిలిన కాలువలను , టన్నేల్ పనులను యుద్ధ ప్రాతి పదికను పూర్తి చేయాలన్నారు.   ప్రాజెక్టుకు సంబ...

రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు

Image
రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన .ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో కలయదిరిగి పెసల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను గిట్టుబాటుకు అమ్ముకోవడంలో ఎటువంటి అసౌకర్యం కలగ కూడదన్నారు. ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. Janechcha