Posts

Showing posts from November, 2024

బేడీలు వేసిన వాళ్ళకు రైతుల సనస్యలేం తెలుసు

Image
  హరీష్ రావు మార్కెట్ యార్డు సందర్శనపై రేణుక ఫైర్ నకిలీ విత్తన కంపెనీలను బహిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఖమ్మం ఇర్రెడియేషన్ ప్లాంట్ నిధులపై విచారణ జరపాలని డిమాండ్ త్వరలో స్థంభాద్రి , పాలేరు ఫిషర్ మెన్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి   రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు , రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీ కేంద్ర మంత్రి , రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , గంగుల కమలాకర్ ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించడంపై ఆమె మండి పడ్డారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుక మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రైతులకు సంకెళ్ళు వేసి , జైల్లో పెడితే తాము విడిపించుకున్నామని చెప్పారు. గన్ మెన్లు లేకుండా ఎప్పుడైనా ప్రజల్లో తిరిగుంటే , ప్రజల సమస్యలు అర్ధమయ్యేవని , గుట్టలు మాయం చేస్తూ కాలం గడిపిన వాళ్ళకు రైతుల సమస్యలు తెలియదన్నారు. తాను జిల్లాకు వస్తున్నాని తెలిసి , ఏదో ఒక పనిగా మార్కెట్ యార్డును సందర్శించారని విమర్శించారు. ఉదయం 8 గంటలకే వెళ్ళి మార్కెట్ యార్డులొ కూర్చుంటే , రైతులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆ మాత్రం...

అదానీ, రేవంత్ అంతర్గత ఒప్పందంపై విచారణ జరపాలి

Image
బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి పోలీసులు అక్రమ కేసులు పెడితే చర్యలు తప్పవు 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి అదానితో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసుకున్న అంతర్గత ఒప్పందంపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అమెరికాలో ఆదానీపై కేసు నమోదైతే , అదానితో పాటు అతను లంచం ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోందన్నారు. మరి , రేవంత రెడ్డికి అదానీ లోపల వేరే ఇచ్చి , బయట వేరే ఇచ్చిండని , దీనిపై కూడా విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ , అదానీ దగ్గర 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలలోని ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అదానీ విషయంలో డిల్లీ నాయకులొకటీ , గల్లీ నాయకులు మరొకటి మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. రాహుల్ గాంధీ అదానీని అరెస్టు చేయాలంటే , రేవంత్ రెడ్డి మాత్రం అదానీకి మంగళ హారతులు పడుతున్నారని. ఎదురెళ్ళి అంతర్గత ఒప్పందాల...

కారు స్పీడు పెరిగేనా ?

Image
అసెంబ్లీ ఎన్నికల తర్వాత , చతికల పడ్డ బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెల్లగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది. వివిధ కేసుల్లో పార్టీ నేతలు , కార్యకర్తలు జైళ్ళకు వెళుతున్నా , జిల్లా నాయకత్వం మాత్రం కార్యకర్తలు అధైర్య పడకుండా అండగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు జిల్లాల్లో కలియదిరుగుతూ క్యాడర్లో జవ సత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ భద్రాచలంలో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత , అక్కడ గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరారు. పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు పార్టీ నుండి వెళ్ళి పోయారు. పార్టీ నాయకుల నామినేటెడ్ పోస్టులు రద్దయ్యాయి. పైగా కార్యకర్తలపై కేసులు నమోదై పార్టీ క్యాడర్ డీలా పడింది. అయితే , ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెనుక పడటం , సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో లోటు పాట్లు , రైతు భరోసా క్రింది రైతులకు ...

ఇదిగో అదిగో అన్నారు ... ఇంత వరకు అతీ గతీ లేదు

Image
ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్కార్పోరేషన్ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ నగర వాసులకు శాపంగా మారింది. దాదాపు 20 డివిజన్ల పరిధిలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిర్మాణ అనుమతులకు , ఎల్‌ఆర్‌ఎస్‌ ధ్రువ పత్రాల జారీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పుడో ప్రతిపాదించిన రహదారులు రద్దయినా , ప్రస్తుతం అమలు చేస్తున్న మాస్టర్‌ ప్లాన్ లో వున్నాయి.   వేలాది ఇళ్ళు , స్థలాల మీదుగా 80 అడుగులు , 180 అడుగుల రోడ్లు పోతున్నట్టు మాస్టర్ ప్లాన్ సూచిస్తోంది. నిజానికీ ఆ రహదారులు లేవు. కానీ. అవి మాస్టర్ ప్లాన్లో వుండడం వల్ల , మున్సిపల్ అధికారులు వాటి స్థానంలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఖమ్మం నగరం ఇంతగా విస్తరించక ముందు , ఖమ్మం చుట్టూ 180 అడుగుల రింగు రోడ్డు నిర్మించాలని ప్రతి పాదించారు. కానీ ఆ తర్వాత , ఆ రింగు రోడ్డు రద్దయింది. అయినా , ఆ రోడ్డు ప్రస్తుతం అమలవుతున్న మాస్టర్ ప్లాన్ లో వుంది. ఇప్పుడు నగరం విస్తరించి , ఆ ప్రతిపాదిత రింగు రోడ్డు నగరం మధ్యలోకి వచ్చింది. వాస్తవానికి ఆ రింగు రోడ్డు లేనే లేదు. అది కేవలం ప్రతిపాదనలకే పరిమితమై , ఎప్పుడో రద్దయింది. కానీ , మాస్టర్ ప్లాన్లో చూపించడం వల్ల , ఆ ర...

కొత్తగూడెం విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు

Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ యుద్ద ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. రానున్న నాలుగేళ్లలో దీన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సోమవారం హైదరబాద్ లో ప్రకటించారు. కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్రానికి పలు మార్లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పౌర విమానాయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ మేరకు లేఖ కూడా రాశారు. మరో వైపు గత సెప్టెంబర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు , కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని ఢిల్లీలో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రోపాలిటన్ నగరాల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు ఎయిర్ కనెక్టివిటీని విస్తరించడంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం విమానాశ్రయం నిర్మించడానికి కావలసిన భూమిని సేకరించడం ప్రారంభించింది. కొత్తగూడెం పట్టణానికి సమీపంలో వున్న పునుకుడు చెల్క లో 1 , 600 ఎకరాల భూమిని ఈ   గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చ...

రా ... రమ్మంటున్న తెలుగు దేశం ... నామ ఏమంటారు ?

Image
తెలంగాణలో తెలుగు దేశం పార్టీని పునరుద్దరిస్తామని ఆ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించి దాదాపు మూడు నెల్లైంది. గతంలో పార్టీలో పనిచేసి , ఇప్పుడు వివిధ పార్టీల్లో వున్న నేతలంతా తిరిగి రావాలని పిలుపు నిచ్చారు. ఈ పిలుపు తర్వాత , వివిధ పార్టీల్లో వున్న పాత తెలుగు దేశం నేతలంతా తిరిగి ఆ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే ఎక్కువ చేరికలుంటాయని ,   ప్రధానంగా మాజీ పార్లమెంట్ సభ్యులు , బీఆర్ఎస్ నేత నామనాగేశ్వర్ రావు పార్టీ మారే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ , అనుకున్నట్లు ఆయన ఇంకా పార్టీ మార లేదు. అయితే , నామ తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం లేదా ? అంటే , లేదని మాత్రం ఖచ్చితంగా చెప్ప లేము. ఎందుకంటే , ఆయనకు ఇప్పటికీ టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. పార్టీ అధిష్టానంతో ,   నందమూరి కుటుంబంతో పరిచయాలున్నాయి.   అందువల్ల , నామ టీడీపీలో చేరే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇప్పటికే ఆయనకు తెలుగు దేశం నుండి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు , మూడు నెల్ల క్రితమే చేరికపై చర్చలు కూడా జరిగినట్లు గుసగుసలు వినిప...

బెదిరించి డబ్బులు దండు కోవాలనుకున్న ఇద్దరి అరెస్ట్ ... ఆయుధాలు స్వాధీనం

Image
  గ్రానైట్ వ్యాపారులను నక్సలైట్ల పేరుతో బెదిరించి , డబ్బులు వసూలు చేసేందుకు వెళుతున్న ఇద్దరిని ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. నగరంలోని ప్రకాష్ నగర్ లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా స్థానిక కస్పాబజారుకు చెందిన మహమ్మద్ అఫ్సర్ , ఖానాపురంకు చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు పోలీసులను చూసి బైక్ అక్కడే వదిలి పారి పోయారు. గమనించిన పోలీసులు వారిని వెంబడించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 3 ఫిస్టల్స్ , 4 మాగ్జిన్లు , 17 బుల్లెట్లు , ఒక హీరో గ్లామర్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకున్నారు. వీరిద్దరూ గతంలో లాండ్ సెటిల్మెంట్లు చేస్తూ , నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడే వారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ , గార్ల , మరిపెడ , కేసముద్రం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టపోయి , అప్పుల పాలు కావడంతో అలాగైనా అప్పులు తీర్చి డబ్బులు సంపాధించాలని నిర్ణయించుకున్నారు. నక్సలైట్ల పేరుతో గతంలో బెదిరించి వసూల చేసిన అనుభవం వుండడం వల్ల ఆయుధాల కోసం 11 నెల్ల క్రితం ఎండీ రియాజ్ అనే వ్యక్తిని సంప్రదించారు. అతన్ని భ...

అడవిలో అలజడి ... వణుకుతున్న ఏజన్సీ

Image
విరామం లేని కూంబింగ్ , నిరంతర నిఘా బయ బ్రాంతులకు గురవుతున్న స్థానికులు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చత్తీష్ ఘడ్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణికి పోతున్నాయి. విరామం లేని కూంబింగులు , పోలీసుల నిరంతర నిఘా మధ్య ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. అడవిలో ఏమాత్రం అలజడైనా స్థానికులు బయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని చర్ల మండల సరిహద్దు ప్రాంతమైన నార్త్ అబుజ్మడ్ లో శనివారం మావోయిస్టులు , పోలీసుల మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చత్తీష్ ఘడ్ లోని నారాయణ పూర్ ,   కంకేర్ జిల్లాల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృత దేహాలు లభ్యమయ్యాయి. నక్సలైట్ల నుంచి ఇన్సాస్ , ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్ తో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్లో గాయపడ్డ ఇద్దరు సైనికులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డీఆర్జీ , ఎస్టీఎఫ్ , బీఎస్ఎఫ్ సంయుక్త పోలీసు బృందాలు రెండు రోజులుగా ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. శనివారం ఉదయం మావ...

22 ఏళ్ళ తర్వాత ... ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు

Image
ఫిబ్రవరిలో జరపాలని నిర్ణయం మహాసభల ఆహ్వాన సఘం ఏర్పాటు భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర5వ మహాసభలు ఖమ్మంలో జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో జరుపతలపెట్టిన ఈ మహాసభలను అందరూ విజయవంతం చేయాలని చేయాలని పిలుపు నిచ్చింది. 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖమ్మంలో జరగనున్న ఈ మహాసభల నిర్వహణకు ఆదివారం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం డిపిఆర్సీ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు పి. సుధాకర్ అధ్యక్షతన ఈ ఆహ్వాన సంఘం ఏర్పాటు సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లడుతూ ఖమ్మం జిల్లా ఎప్పుడూ విద్యార్ధి ఉద్యమాలను అక్కున చేర్చుకుంటుందన్నారు. నేడు దేశంలో , రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్లో విద్య , ఉద్యోగం అనేవి ప్రధానమైన సమస్యలన్నారు. రాష్ట్రంలో 1864 పాఠశాలలో ఒక్క టీచర్ కూడా లేక మూతపడుతున్నాయని , లక్షకు మందికి పైగా విద్యార్థులు చదువులకు దూరమయ్యారని తెలిపారు. ఈ నేపధ్యంలో యూనివర్శీటీ విద్య నుండి పాఠశాల విద్య వరకు సమస్యలపై ఈ మహాసభ చర్చిస్తుందని చెప్పారు. సమావేశంలో ప్రముఖ విద్యా వేత్తలు ఐ.వి.రమణా రావు , రవి మారుత్ , కాంతా రావు , రైతు సంఘం రాష్ట్ర నాయకు...