Posts

Showing posts from November, 2025

మధిరలో ఏసిబి ట్రాప్

Image
పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్రావు ఎక్స్ గ్రేషియా మంజూరుకు డబ్బులు డిమాండ్ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర పట్టణంలో అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ ) అధికారులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్రావు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందగా అతనికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్ గ్రేషియా డబ్బులు మంజూరు చేసేందుకు రూ 30 వేలు లంచం డిమాండ్ చేయగా అందులో నుండి రూ 15 వేలు తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మరణించిన కార్మికుడికి సంబంధించిన మరణ ధ్రువ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఎకౌంటు జిరాక్స్ కాపీలను లేబర్ ఆఫీస్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ లక్ష 30 వేలు ఎక్స్ గ్రేషియా గా అందజేస్తుంది. వీటిని ప్రభుత్వానికి పంపించాలంటే రూ 30 వేలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ నీ ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు కెమికల్ పౌడర్ పూసిన నోట్లను బాధితుడికి ఇచ్చి వాటిని లేబర్ ఆఫీసర్ చందర్రావు కు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల దాడిని పసిగట్టిన చందర్రావు పరారయ్యేందుకు ప్రయత్నించగ...

బిజెపి, బిఆర్ఎస్ వైఫల్యం వల్లే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది

Image
ఆరు గ్యారెంటీలు అమలు కోసం జాగృతి పోరాటం తనను విమర్శించే నాయకులను ఎవరూ రక్షించలేరు జాగృతి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( తాళ్లూరి అప్పారావు, మధిర ) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఫల్యం చెందడం వల్లనే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా మధిర నుండి  ఎర్రుపాలెం మండలం జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ కవిత వెన్నుపోటురాలు అని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరన్నారు. ప్రజా జీవితంలో ఎవరిపై ఆరోపణలు వచ్చిన దానికి సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జాగృతి సంస్థ నిరంతర పోరాటం చేస్తుందన్నారు.  ప్రజల్లో ఉంటూ ప్...

కిన్నెరసాని గురుకులంలో గిరిజన ఆహారోత్సం

Image
కిన్నెరసాని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో గురువారం జన జాతీయ గౌరవ దివస్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గిరిజన కుటుంబాలు రోజు వారీ ఉపయోగించే వివిధ రకాల సాంప్రదాయ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. వాటిలోని పోషక విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతాను ఉపాధ్యాయులు విద్యార్థులకు వువరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు గిరిజన సాంప్రదాయాల పరిరక్షణకు, విద్యార్థుల్లో సంస్కృతిపై అవగాహన పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

గిరిజన సాంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించాలి ... ఎస్. శ్యామ్ కుమార్

Image
గిరిజన సాంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ అన్నారు. మంగళవారం గిరిజనుల సాంప్రదాయాల్లో భాగమైన “ సీత్లా పండుగ ” ను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గిరిజనుల సాంస్కృతిక వారసత్వాన్ని తర తరాలకు అందజేయాలని కోరారు. ఆ ఉద్దేశంతోనే కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలలో బంజారాలకు అత్యంత ప్రాధాన్యమైన “ సీత్లా పండుగ ” ను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ పండుగను అర్ధం చేసుకొని భావి తరాలకు తెలియ జేయాల్సిన బాధ్యత అందరిపైనా వుందన్నారు. అనంతరం బంజారాల ప్రత్యేకమైన ఆచారాలు , సంప్రదాయాలు , సీత్లా పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు , గుర్తింపు చిహ్నాలను ప్రదర్శించడంతో పాటు   ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కొత్త స్టేజ్ నిర్మాణానికి భూమి పూజ అంతకు ముందు పాఠశాలలో కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాల సందర్భంగా కొత్త స్టేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి తేజావత్ జానకి రా...

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు కిన్నెరసాని గురుకుల విద్యార్థులు

Image
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కిన్నెరసాని గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం - ఖమ్మం జిల్లాల స్థాయిలో నిర్వహించిన యోగా సెలక్షన్ పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల (బాయ్స్) కు చెందిన విద్యార్థులు యు. పార్థు, ఎం. దిలీప్ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి అండర్ -17 వయో విభాగంలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించారు. విద్యార్ధులు అర్హత సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్ధులను అభినందించి, కరీంనగర్లో ఈ నెల 13,14,15 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.   

ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలు విడనాడాలి

Image
యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగూరు వలి ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలి, ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ ఏ వినోదరావు లు డిమాండ్ చేశారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయం లో శుక్రవారం జరిగిన యుటిఎఫ్ మధిర మండల ఆఫీస్ బేరర్స్ సమావేశంలో వారు మాట్లాడుతూ 8 వ వేతన సంఘం పేరుతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా నిబంధనలను రూపొందించడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల ఆలస్యంగా కేంద్రం ఏర్పాటుచేసిన 8 వ వేతన సంఘం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు ప్రతి ఉద్యోగిని, పెన్షనర్ని ఆందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయన్నారు. పెన్షనర్స్ కి పిఆర్సి వర్తింపులో, డి ఏ వర్తింపులో  అసంబద్ధ నిబంధనలను రూపొందించారన్నారు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాలు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి గురించి పట్టించుకోకపోవడం, ఐదు డిఏలు ప్రకటించకపోవడం, సర్వీస్ లో ఉన్న రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల అనేక బిల్లులు పెండింగ్లో ఉంచటం ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు. కేంద్ర, ...

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కిన్నెరసాని గురుకుల పాఠశాల విద్యార్థి

Image
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్ధి ఎంపికయ్యాడు. ఈ పాఠశాల్లో 10 వ తరగతి చదువుచున్న విద్యార్ది  కే. హర్షిత్ తన ప్రతిభను చాటి అండర్–17 వయో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున, ఉపాధ్యాయులు విద్యార్థి హర్షత్ ను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు

రాష్ట్ర స్థాయి పోటీలకు కిన్నెరసాని గిరిజన గురుకుల విద్యార్ధుల ఎంపిక

Image
భినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్, బేస్ బాల్ సెలక్షన్ పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. సాఫ్ట్ బాల్ అండర్–17 విభాగంలో ఇ. హర్షవర్ధన్, అండర్–14 విభాగంలో ధర్మ నాయక్,  బి. రిత్విక్ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అదే విధంగా బేస్ బాల్ అండర్–14 విభాగంలో ప్రవీణ్, అండర్–17 విభాగంలో జశ్వంత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు..

వరద ముంపు శాశ్వత పరిష్కారానికి చర్యలు

Image
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి  పెద్ద చెరువు సంరక్షణ, కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి      ( తాళ్లూరి అప్పారావు, మధిర ) వర్షాల వలన మధిరలో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, వరద ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మధిర పట్టణం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ శనివారం పర్యటించారు. వర్షం కురిసినప్పుడు జలమయం అయ్యే కాలనీలు, వరద ఇబ్బంది పడే లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మధిర మున్సిపాలిటీలోని హనుమాన్, ముస్లిం కాలనీ లను క్షేత్రస్థాయిలో కాలినడకన తిరిగుతూ వరద ప్రభావ పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  లోతట్టు ప్రాంతాల వరద ముంపుకు శాశ్వతంగా సమస్యలు పరిష్కారానికి టౌన్ మ్యాప్ లను పరిశీలిస్తూ అధికారులకు అదేశాలు ఇచ్చారు. స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్డు వెడల్పు పెంచేందుకు...

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

Image
ఖమ్మం యస్.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల సి.యస్.ఈ. విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు గంటెల ప్రభాకర్ , ఆచార్య నాగార్జున విశ్వ విధ్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. చింతకాని మండలంలోని అనంత సాగర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ , “ ఎన్హాన్స్డ్ మెథడాలజీస్ ఫర్ డేటా సెక్యూరిటి ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్" అనే అంశం పై డా. బొబ్బా బసవేశ్వర రావు పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశారు. ఇందుకు గాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుండి పట్టాను పొందినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి , ప్రిన్సిపల్ డా. జి. రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభాకర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో క్లౌడ్ కంప్యూటింగ్ , డేటా సెక్యూరిటీ , డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై పరిశోధన ద్వారా పొందిన అనుభవం విద్యార్థులకు , సి.యస్.ఈ విభాగ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశా భావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వారు ప్రభాకర్ ను అభినందించారు. అభినందించిన వారిలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్ , గంధం శ్రీనివాసరావు , డా ...