రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కిన్నెరసాని గురుకుల పాఠశాల విద్యార్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్ధి ఎంపికయ్యాడు. ఈ పాఠశాల్లో 10 వ తరగతి చదువుచున్న విద్యార్ది కే. హర్షిత్ తన ప్రతిభను చాటి అండర్–17 వయో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి తిరుపతి, పి.ఇ.టి రాకేష్, పి.డి నాగార్జున, ఉపాధ్యాయులు విద్యార్థి హర్షత్ ను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు

Comments
Post a Comment