రాష్ట్ర రెండో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ అమలు చేయాలి
పెండింగ్ ఐదు డి ఏ లను విడుదల చేయాలి ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి ఎస్ టి ఎఫ్ ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రంలో రెండో పిఆర్సి నివేదికను ప్రభుత్వం తీసుకుని అమలు చేయాలని, పెండింగ్ ఐదు డిఏ లను విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ టి ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో మధిర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి నాగరాజు, ఈ వీరయ్య ల అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్ శివ శంకరన్ అధ్యక్షతన ద్విసభ్య కమిటీతో ఏర్పాటైన పిఆర్సి గడువు ముగిసినప్పటికీ నివేదికను స్వీకరించకపోవడం, ఫిట్మెంట్ ప్రకటించకపోవడం శోచనీయం అన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏ లను తక్షణమే ప్రకటించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు అన్నిటిని క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ను క్లియర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ టి ఎఫ్ ఐ (స్కూల్ ట...