మధిర రామాలయ ప్రాంగణంలో పురాతన శిలాజం
- సుమారు 5 కోట్ల సంవత్సరాలు నాటిదని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శివనాగిరెడ్డి
- శిలాజాన్ని విస్తృత పరిశీలన కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన ఆలయ పునర్నిర్మాణ కమిటీ
( తాళ్లూరి
అప్పారావు, మధిర
)
మధిరలో అరుదైన పురాతన శిలాజం లభ్యమైంది. ఇది సుమారు 5 కోట్ల సంవత్సరాల నాటి
దారుశిలాజంగా చెబుతున్నారు. పట్టణంలోని రైల్యే స్టేషన్ వద్ద గల రామాలయ ప్రాంగణంలో
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శివనాగిరెడ్డి ఈ శిలను
గుర్తించారు. రామాలయాన్ని పునర్నిమించాలని రైల్యే అధికార్లు, పట్టణ ప్రముఖులు
ఇటీవల నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో
ఆదివారం ఆలయ నిర్మాణానికి తగిన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రముఖ వాస్తు శిల్పి, అమరావతి బుద్ధ విహార
సీఈవో,
తెలంగాణ రాష్ట్ర నాగార్జున బుద్ధవనం ప్రాజెక్ట్
మాజీ చీప్ అడ్వైజర్ డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డిని అక్కడకు పిలిచారు.
ఈ సందర్భంగా బయట పడ్డ ఓ పురాతన రాయిని ఆయన పరిశీలించారు. ఈ రాయి సుమారు 5 కోట్ల సంవత్సరాల నాటిదని గుర్తించారు. అనతరం శివ నాగిరెడ్డి మాట్లాడుతూ దీనిని దారుశిలాజంగా పిలుస్తారని చెప్పారు. అతి పురాతనమైన ఈ శిలాజాన్ని విస్తృత పరిశీలన కోసం హైదరాబాదు ల్యాబ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన మధిర రైల్వే రామలయం వద్ద ఐదు కోట్ల సంవత్సరాల నాటి శిలాజం కనిపించడంతో ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆశ్చర్యానికి గురైంది. ఈ పరిశీలనలో శివ నాగిరెడ్డి వెంట పట్టణ ప్రముఖులు కోనా జనార్దన్ రావు, మల్లాది వాసు, సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, కటికల సీతారాం రెడ్డి, కర్నాటి రామారావు, భాను ప్రకాష్ తదితరులు వున్నారు.

Comments
Post a Comment