గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

Suthakani Syam Kumar

తెలంగాణ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధి కోసం రూ.60 కోట్ల కార్పస్ ఫండ్‌ విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ ఉద్యోగుల సంఘం (TEA)  రాష్ట్ర అద్యక్షులు-- ఎస్.శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో హర్షించ దగ్గ విషమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ విడుదల చేసిన నిధుల్లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు రూ.10 కోట్లు కేటాయించడం సంతోషంగా వుందన్నారు. దీంతో గిరిజనుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేసినట్లైందని కొనియాడారు. ఈ నిధులతో పాత గురుకులాల మరమత్తు పనులు , అభివృద్ధితో పాటు,  కొత్త గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి గృహాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, త్రాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, స్మార్ట్ క్లాస్‌ రూంల వంటి అనేక సదుపాయాలు కల్పించ వచ్చన్నారు. ఫలితంగా గిరిజన విద్యార్థులు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యపై చూపుతున్న శ్రద్ధ, దూరదృష్టి, కృషి నిజంగా అభినందనీయమని, ఈ నిర్ణయం గిరిజన విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సెక్రటరీ సీత లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చే దీపంలా నిలుస్తుందని శ్యామ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Comments

Popular Posts

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే