Posts

Showing posts from December, 2025

మధిర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ

Image
ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ విద్య టూరిజం హబ్ గా మధిర నియోజకవర్గం జీ+2 పద్ధతిలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ఘనమైన చరిత్ర కలిగిన మధిర పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో వేగవంతంగా పనులు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క మల్లు తెలిపారు. మధిర పట్టణంలో రూ 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మధిర మున్సిపాలిటి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అల్లాడుతున్న సమయంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న బొంబాయిలో 86 మంది సభ్యులతో ఆవిర్భవించిందన్నారు.   కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మధిర పట్టణ ప్రజలకు పౌర సేవలు అందించే మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు భూమిపూజ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకు స్థానిక మున్సి...
Image
ప్రజా పాలనను ప్రజలు దీవించి పట్టం కట్టారు భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు  2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్తుకు ప్రణాళికలు సిద్ధం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  ( తాళ్లూరి అప్పారావు, మధిర ) తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి 85 శాతం స్థానాలు గెలుచుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో తాజాగా గెలిచిన సర్పంచుల అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు దీవించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎవరు సర్పంచులుగా గెలిచిన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేస్తాం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ విజయ దుందుభి లో కాంగ్రెస్ కార్యకర్తల కృషి పోరాటం అద్భుతమైనదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ 8,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని డ...

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

Image
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపీచంద్ , కళ్యాణం ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్. గోపీచంద్ కళ్యాణం నాగేశ్వరావు డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక క్లబ్ కాంప్లెక్స్ ఆవరణలో టి సాంబయ్య అధ్యక్షతన  ఆ సంఘం ఏడవ మహాసభలను నిర్వహించారు. మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పెన్షనర్లు వారి సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న జిపిఎఫ్, టీఎస్ జిఎల్ఐ, ఈ ఎల్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ వెంటనే చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యం అందించాలని , వేతన సవరణ నివేదిక ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే చెల్లించాలన్నారు.  398 రూపాయల  వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ 9000 చెల్లించాలని, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ 15000 పెన్షన్ చెల్లించాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నూతనంగా సర్పంచ్ కి ఘన  సన్మాన...

ఈ నెల 28న కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు

Image
పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలను స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 28 న ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1975 లో గిరిజన విద్యార్థులకు విద్యనందించాలని , ఆదర్శవంతమైన గురుకుల విద్యా విధానంతో , అటవీ ప్రాంతమైన కిన్నెరసానిలో ఈ విద్యా సంస్థను స్థాపించారని చెప్పారు. అప్పటి నుండి ఈ పాఠశాలలో పేద , బడుగు , గిరిజన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి 40 బ్యాచ్‌ల10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులై సమాజంలో అడుగుపెట్టారని తెలిపారు. ఇక్కడ చదువుకున్న గిరిజన విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు , డాక్టర్లు , ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు , పత్రికా రంగ నిపుణులు , వ్యాపార వేత్తలు , రైతులుగా స్థిర పడ్డారని శ్యామ్ కుమార్ వివరించారు. అంతే కాకుండా , ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. ఈ చారిత్రాత్మకమై...

అధునాతన వస్త్రా ప్రపంచానికి కాసం పెట్టింది పేరు

Image
అధునాతన వస్త్రా ప్రపంచానికి కాసం పెట్టింది పేరు మధిర లో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం మధిరలో అతి పెద్ద వస్త్ర దుకాణం ఆట పాటలతో సందడి చేసిన సినీ నటి, యాంకర్ అనసూర్య భరద్వాజ్ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) అదునాతన వస్త్రాలు, జెంట్స్, లేడీస్, కిడ్స్ వేర్, నిత్య నూతన వెరైటీలకు, నూతన కలెక్షన్స్ కు కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందని ప్రముఖ సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. మధిర పట్టణంలోని వైరా రోడ్ లో కాసం ఫ్యాషన్స్ 23వ వస్త్ర దుకాణాన్ని ఆదివారం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధిర లో కాసం ఫ్యాషన్స్ దుకాణాన్ని ప్రారంభించడం ఆనందంగ ఉందన్నారు.మధిర ప్రాంత ప్రజలు ఖమ్మం, విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కాసం ఫ్యాషన్స్ లో అన్ని రకాల అధునాతనమైన వస్త్రాలు అందుబాటు ధరల్లో దొరుకుతాయన్నారు. కాసం ఫ్యాషన్స్ లోని వస్త్ర వెరైటీలను పరిశీలిస్తూ అభిమానులతో కలిసి సందడి చేశారు. కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత  5 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్ర...

ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం

Image
( తాళ్లూరి అప్పారావు, మధిర ) స్థానిక లడక్ బజార్ అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామికి బుధవారం స్థానిక వైరా నదిలో భక్తుల కోలాహలం మధ్య ఆరట్టు ఉత్సవం( నదీ స్నానం ) ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు స్వామివారి నదీ స్నానంతో ముగిశాయి. స్వామివారి ఆలయం వద్ద నుండి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో భక్తుల కోలాహలం మధ్య స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వైరా నది వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి నదీ స్నానాన్ని ఆచరింపజేశారు. స్వామి వారితో పాటు మాలదారులు భక్తులు నది స్నానం ఆచరించారు. మంగళవారం భారీ ఎత్తున జరిగిన పల్లివేట గ్రామోత్సవం అనంతరం ఆలయ మంటపంలో ఉంచిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అయ్యప్ప మాలదారులు భక్తులు నదీ స్నానానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు.  నది వద్ద స్వామివారికి పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహించి మహిళలకు పసుపు, కుంకుమలను అందజేశారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్నదానాన్ని పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి వెంకట రవికుమార్ ప్రారంభించారు. బ్రహ్మ...

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవం

Image
( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర పట్టణంలోని లడక బజార్ అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ  అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథం పై ఉంచి అయ్యప్ప స్వాములు భజనలు చేస్తూ ఘనంగా ఊరేగించారు. స్వామివారి ఆలయాన్ని నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పల్లి వేట కార్యక్రమంలో కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన వాయిద్య బృందాలు, డీజే వాహనం కోలాట బృందాలు, మహిళలు, మాలదారులు స్వామివారి పాటలతో మధిర పురవీధులలో స్వామి వారి పల్లి వేట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం సందర్భంగా స్థానిక లడక్ బజార్ దేశభక్తి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం వద్ద నుండి రైల్వే గేట్ వరకు మామిడి తోరణాలు కొబ్బరి ఆకులు, అరటి బోదేలు, కాషాయ తోరణాలతో అందంగా అలంకరించారు. గ్రామోత్సవం అనంతరం తిరిగి స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ మండపంలో ఉంచి పల్లికురుప్ప( శయ్య ) కార్య...