Posts

Showing posts from January, 2025

పథకాలు సరే ... వీళ్ళ సంగతేంటి ?

Image
ముగిసిన 4 పథకాలపై క్షేత్ర స్థాయి సర్యే లబ్దిదారుల ఎంపికపై పలు అనుమానాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా , కొత్త ఆహార భద్రత కార్డులు , ఇందిరమ్మ ఇళ్ళ పథకాల క్షేత్ర స్థాయి సర్యే దాదాపు పూర్తయింది. ఈ సర్యేలో నాలుగు పథకాలకు లబ్దిదారులను గుర్తించడంతో పాటు ముసాయిదా లబ్దిదారుల జాబితాను కూడా తయారు చేశారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఫైనల్ చేస్తారు. 25 లోగా డేటా ఎంట్రీ పూర్తి చేసి , జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో పెడతారు. గ్రామంలో ప్లేక్షీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 26 నుండి పథకాలు అమలవుతాయి. అయితే , లబ్దిదారుల ఎంపికపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు కొంత మంది అర్హులకు అవరోధంగా మారుతున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యులే అంటున్నారు. మంచి పథకాలంటూనే నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. మొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు తుమ్మల , ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటి రెడ్డి వెంకట్ ...

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

Image
  తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి పొంగులేటి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి 8 :45 గంటలకు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయ పాలెం సమీపంలో ఒకేసారి కారు రెండు టైర్లు పేలాయి. కారు కంట్రోల్ తప్పినప్పటికీ , డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వెంటనే మంత్రి పొంగులేటి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని తన నివాసానికి సురక్షితంగా చేరుకున్నారు. హన్మకొండ నుండి ఖమ్మం వస్తుండగా ఈ ఘటన జరిగింది. Janechcha

మున్నేరు రిటైనింగ్ వాల్ పనుల పురోగతిపై పొంగులేటి అసంతృప్తి

Image
  భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి ఈ నెల 16 నాటికి పనుల షెడ్యూల్ సమర్పించాలి జూలై 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి అధికార్ల సమీక్షా సమావేశంలో మంత్రి ఆదేశం ఖమ్మం వద్ద మున్నేరు నదికి ఇరు వైపుల రూ. 690 కోట్లతో ఇర్మించ తలపెట్టిన రిటైనింగ్ వాల్ పనుల పురోగతిపై రాష్ట్ర రెవెన్యూ , హౌజింగ్ , సమాచార పౌర సంబంధాల శాశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రోజువారి పనుల వివరాలతో షెడ్యూల్ రూపొందించి , జనవరి 16 నాటికి సమర్పించాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. ఆదివారం ఆయన ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్లోని తన నివాసంలో   జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ , సంబంధిత రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ , భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వివరాలను , నిర్మాణ పురోగతిని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో రిటైనింగ్ వాల్ నిర్మా...

పులకించిన భద్రగిరి ...

Image
అత్యంత వైభవంగా వైకుంట రాముని ఉత్తర ద్వార దర్శనం గరుడ వాహనంపై మహా విష్ణువు అవతారంలో సాక్షాత్కారం అష్టోత్తర శత నామార్చనతో మారు మ్రోగిన భద్రాద్రి పుణ్య క్షేత్రం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి పులకించింది. పుష్య మాసపు చల్లని వీచికలు ఆధ్యాత్మిక సుగంధాలను మోసు కొచ్చాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం తెల్లవారు జామున అష్టోత్తర శత నామార్చన ప్రతిధ్వనిస్తున్న వేళ , వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భద్రాద్రి రామయ్య గరుడ వాహనంపై మహా విష్ణువు అవతారంలో దర్శనమిచ్చాడు. పసిడి వర్ణ సుందరాలంకృత తలుపులు తెరుచు కోవడంతో , హేమంత మేఘంలా అలుముకున్న ధూపంలో భక్త బాంధవుడు ఉత్తర ద్వారంలో సాక్షాత్కరించాడు.  భక్తుల రామ నామ స్మరణతో భద్రగిరి మారు మ్రోగింది. ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష ఆరాధన నిర్వహించారు. శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శత నామార్చనను అత్యంత వైభవంగా జరిపారు. చతుర్వేదాలు , ద్రవిడ , ప్రబంధాలు , ఇతిహాసాలు , శరణాగతి గర్వ గరుడ దండకం , భక్త రామదాసు రచించిన దాశరథి శతకం పఠించారు. వైకుంఠ రామునికి అష్టోత్తర శత హారతిని (108 వత్తుల హారతి) సమర...

నాయనానందకరంగా రాములోరి నదీ విహారం

Image
గోదారి మురిసేలా భద్రాద్రి రాముని తెప్పోత్సవం పోటెత్తిన భక్తులతో జన సంద్రంగా మారిన నదీ తీరం నేడు కన్నుల పండువలా వైకుంఠ ద్వార దర్శనం   జై జై రామ్... సీతారామ్ అంటూ భక్తుల చేసిన జయ జయ ద్వానాల మధ్య భద్రాద్రి లో సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగ రంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు , వేద పండితుల మంత్రోఛ్చారణలు పవిత్ర గోదావరి నదీ తీరంలో మార్మోగుతుండగా రామయ్య హంస వాహనంపై వేం చేసి భక్తులను పరవశింప జేశారు. ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు పలు అవతారాల్లో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించిన శ్రీ సీతారామచద్ర స్వామి , గోదావరి నదీ తీరంలో సీతమ్మ వారితో కలిసి జల విహారం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో ఐదు సార్లు నదిలో విహరించారు. గోదారమ్మ మురిసి పోయేలా వృత్తాకారంలో రామయ్య నదీ విహారం సాగింది. విద్యుత్‌ దీపాల అలంకరణతో కన్నుల పండువగా సాగిన ఈ రామయ్య తెప్పోత్సవాన్ని చూసి భక్తులు తరించి పోయారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు , పూజారుల ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణా సంచా కాల్చి ఆనందంతో ఉప్పొంగి ప...