పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలను స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 28 న ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1975 లో గిరిజన విద్యార్థులకు విద్యనందించాలని , ఆదర్శవంతమైన గురుకుల విద్యా విధానంతో , అటవీ ప్రాంతమైన కిన్నెరసానిలో ఈ విద్యా సంస్థను స్థాపించారని చెప్పారు. అప్పటి నుండి ఈ పాఠశాలలో పేద , బడుగు , గిరిజన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి 40 బ్యాచ్ల10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులై సమాజంలో అడుగుపెట్టారని తెలిపారు. ఇక్కడ చదువుకున్న గిరిజన విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు , డాక్టర్లు , ఇంజనీర్లు , శాస్త్రవేత్తలు , పత్రికా రంగ నిపుణులు , వ్యాపార వేత్తలు , రైతులుగా స్థిర పడ్డారని శ్యామ్ కుమార్ వివరించారు. అంతే కాకుండా , ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. ఈ చారిత్రాత్మకమై...
Comments
Post a Comment