ఆంధ్ర సరిహద్దు మధిరలో మారు మోగిన నిరసన గళం. అక్రమ కేసులను ఖండిస్తూ మద్దతు పలికిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ వార్తలు రాసే మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అంటే బావ ప్రకటన స్వేచ్ఛ పై దాడేనని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మడిపల్లి గోపాల రావు, బెజవాడ రవి బాబు, చిత్తారు నాగేశ్వర రావు, మిరియాల రమణ గుప్తా, తూమాటి నవీన్ రెడ్డి, కుంచం కృష్ణారావు, ఎన్ గోవింద్ ఆళ్ల కృష్ణ అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, నిర్బంధ విచారణను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో సాక్షి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ అట్లూరి సాంబి రెడ్డి, సాక్షి మీడియా డివిజన్ రిపోర్టర్ చేకూరి వినోద్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వివిధ చానళ్లు, పత్రిక విలేకరులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు, చానళ్లపై కేసులు పెట్టడం అంటే భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి ...
Comments
Post a Comment