మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి పొంగులేటి కారుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి 8 :45 గంటలకు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయ పాలెం సమీపంలో ఒకేసారి కారు రెండు టైర్లు పేలాయి. కారు కంట్రోల్ తప్పినప్పటికీ, డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది. వెంటనే మంత్రి పొంగులేటి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని తన నివాసానికి సురక్షితంగా చేరుకున్నారు. హన్మకొండ నుండి ఖమ్మం వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Comments
Post a Comment