సీతారామను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలి

యాతాలకుంట టన్నెల్ పనులు శరవేగంగా చేపట్టాలి నిర్ణిత గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి భూసేకరణలో అలసత్వం వహించ వహించ వద్దు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ , పొంగులేటి సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ , కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయ శాఖా , మంత్రి మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు మేరకు జల సౌదలో సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రులు తుమ్మల , పొంగులేటితో కలసి నీటి పారుదల శాఖాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యాతాల కుంట టన్నెల్ పనులను శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ పంప్ హౌజ్లను ప్రారంభించామని , మిగిలిన కాలువలను , టన్నేల్ పనులను యుద్ధ ప్రాతి పదికను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబ...