రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కితాబు
- ఖమ్మం, పాలేరు, మధిర ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
- నేరుగా రైతులతో మాట్లాడిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలతో ప్రాణనష్టం చాలా వరకు తగ్గిందన్న కేంద్రమంత్రి
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఉపముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నేరుగా ఆయన పాలేరు మెయిన్ కెనాల్ వద్ద లాండై, కాల్వ తెగటం వల్ల ఖమ్మం- నుండి సూర్యాపేట వైపు వెళ్ళే జాతీయ రహదారికి జరిగిన నష్టాన్ని చూశారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడారు. వరదల వల్ల తాము సర్వం కోల్పోయామని ఈ సందర్భంగా రైతులు కేంద్ర మంత్రికి తమ గోడును వెళ్ల బోసుకున్నారు. ఓ రైతు తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ బోరున విలపించడంతో చౌహాన్ కుర్చీలో నుంచి లేచి ఆ రైతును వేదిక పైకి పిలిచి ఓదార్చారు. తాను కూడా రైతునేనని, తనకు రైతుల కష్టాలు తెలుసని వ్యాఖ్యానించారు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని, దీంతో వరి, మిర్చి వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న
నివారణ చర్యల వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంశించారు.
కాగా, రైతులతో మాట్లాడిన
అనంతరం బండి సంజయ్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్
రెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.3,300
కోట్ల వరద సాయాన్ని విడుదల చేసింది.
Comments
Post a Comment