మీరు గెలిపించండి ... నేను అభివృద్ధి చేస్తా

Ponguleti Srinivas Reddy
  • ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
  • పలు వార్డుల్లో రోడ్డు షో ... పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు 

గత పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా ఆనాటి 'దొర'కు లేక పోయిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుందని చెప్పారు. ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ... ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటాను" అని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. రెడ్డిపల్లి (1వ వార్డు) నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ముత్తగూడెం, గొల్లగూడెం, బారుగూడెం మీదుగా ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి వరకు కొనసాగింది. మంత్రి పొంగులేటి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు హారతులతో స్వాగతం పలకగా, పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Ponguleti Srinivas Reddy

ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికలు రాగానే రంగు రంగుల కండువాలు వేసుకుని మాయ మాటలు చెప్పేందుకు వస్తారన్నారు. గతంలో 'వరి వేస్తే ఉరి' అని రైతులను భయ పెట్టిన వారు నేడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటోందని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మొదటి విడత కింద ఇప్పటికే 587 ఇళ్లు మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రెండో విడత జాబితాను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన పేదలకు స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

మంత్రి సమక్షంలో భారీ చేరికలు

Ponguleti Srinivas Reddy


అంతకు ముందు ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం కీలక రాజకీయ మార్పుకు వేదికైంది. బీఆర్ఎస్ కీలక నేత తప్పెట్ల గిడ్జన్ (మున్నా) ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన సుమారు 40 కుటుంబాలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. స్వయంగా మంత్రి పొంగులేటి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Comments

Popular Posts

చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు

చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు