లొంగి పోయిన 17 మంది మావోయిస్టులు
- ఇప్పుడు మావోలకు కర్రెగుట్టలు సేఫ్ జోన్ కాదు
- అందరూ లొంగి పోవాలని ఎస్పీ రోహిత్ రాజు పిలుపు
17 మంది నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులు శుక్రవారం భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగి పోయారు. ‘ ఆపరేషన్ చేయుత’ లో భాగంగా వీరు లొంగి
పోయినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. లొంగి పోయిన వారిలో ఆరుగురు మహిళలు, పదకొండు మంది పురుషులు
వున్నారు. వీరంతా చత్తీష్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన వారు. ఈ సందర్భంగా
రోహిత్ రాజు మాట్లాడుతూ కర్రెగుట్ట మావోయిస్టులకు ఇప్పుడు సేప్ జోన్ కాదని, అందరూ దళాన్ని వీడి జన
జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపు నిచ్చారు. లొంగి పోయిన వారికి ప్రభుత్వం
ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గడచిన 6 నెలల్లో జిల్లా వ్యాప్తంగా
282 మంది మావోయిస్టులు లొంగి పోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లొంగి పోయిన
మావోయిస్టులు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు.
.jpeg)
Comments
Post a Comment