ధంసలా పురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయండి

 

MP Raghuram Reddy

  • రైల్యే జీఎంకు ఎంపీ రఘురాం రెడ్డి వినతి

ఖమ్మం నగరంలోని ధంసలా పురం వద్ద ( గేట్ నెంబర్ 106 ) పెండింగులో వున్న రైల్యే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి,  సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కోరారు. బుధవారం జీఎంను కలిసిన ఎంపీ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్మాణం పెండింగ్లో ఉండటం వల్ల స్థానిక రైతులు, పరిసర గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. త్వరిత గతిన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. వెంటనే స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ సంబంధిత చీఫ్ ఇంజనీర్, తదితర అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఇంతక ముందు ప్రతిపాదించిన డోర్నకల్ -మిర్యాలగూడెం, డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చి డోర్నకల్,- వెన్నారం, మరిపెడ, మోతే మీదుగా రూపొందించిన ప్రతిపాదనలపై పై చర్చించారు. అలాగే, రద్దు చేసిన రైళ్లను తిరిగి  పున:రుద్దరించాలని, ఖమ్మం, బోనకల్, ఎర్రుపాలెం, డోర్నకల్ నుండి భద్రాచలం రోడ్డు వెళ్ళే మార్గంలో గాంధీనగర్ స్టేషన్లో  రైళ్లను ఆపాలని రైల్వే జీఎంని ఎంపీ రఘురాం రెడ్డి ఈ సందర్భంగా కోరారు.    

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి