Posts

Showing posts from February, 2025

తెలంగాణలో తొలి నీలి చెవుల లకుముకి పిట్ట

Image
ఖమ్మం కనక గిరి అడవుల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం దర్శనమిచ్చిన 65 పక్షి జాతులు , 5 క్షీరద జాతులు , 5 చేప జాతులు 12 గంటలు నడచి కనుగొన్న 12 మంది సభ్యుల బృందం   తెలంగాణలో తొలి సారి నీలి చెవుల లకుముకి పిట్ట (   బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ) దర్శన మిచ్చింది. ఖమ్మం జిల్లాలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మాహాద్భుత ఘట్టాన్ని 12 మంది సభ్యులు గల ప్రకృతి ప్రేమికుల బృందం రికార్డ్ చేసింది. బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ను తెలంగాణలో రికార్డు చేయడం ఇదే తొలి సారి. అంతే కాకుండా రాష్ట్రంలోనే మొదట సారి ఓ గొప్ప జీవ వైవిధ్యాన్ని ఇక్కడ కనుగొన్నారు. అద్భుతమైన వృక్ష , జంతు జాలం ఈ ఫారెస్టులో కను విందు చేస్తోంది. 65 పక్షి జాతులు , 5 క్షీరద జాతులు , 5 చేప జాతులు ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు.   ప్రదీప్ ప్రజ్ ( వైల్డ్ తెలంగాణ ) , నవీన్ బాలా , సుజీత్ ఎ (మెరాకి ఆర్గనైజేషన్) , హరికృష్ణ పి (విడబ్ల్యూఓఎల్ఎఫ్ ఫౌండేషన్) , జె రమేష్ తో పాటు12 మంది ప్రకృతి ప్రేమికులు సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్టులో ఆదివారం నుండి 12 గంటల సంచరించారు. దట్టమైన అడవిలో 4 ...

దిశా ... నిర్ధేశం

Image
స్థానిక సంస్థల ఎన్నికలపై ఖమ్మం క్యాడరును అలెర్ట్ చేసిన కేటీఆర్ హైదారాబాద్ లోని పువ్వాడ అజయ్ ఇంట్లో అనూహ్యంగా విందు మీటింగ్ త్వరలో ఖమ్మంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడి   రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఖమ్మం జిల్లా పార్టీ క్యాడరుకు దిశా నిర్ధేశం చేశారు. ఈ నెల 15 లోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలువడే అవకాశం వుండడంతో హైదారాబాద్ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం జిల్లా నాయకులు , ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇటీవల పువ్వాడ అజయ్ కుమార్ అక్కడ స్వంత ఇల్లు కట్టు కొని గృహ ప్రవేశం చేయడం , నిన్న పువ్వాడ పెళ్లి రోజు కూడా కావడంతో మంగళ వారం పువ్వాడ ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ కు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి హాజరైన కేటీఆర్ అక్కడే భారీగా తరలి వచ్చిన పార్టీ క్యాడర్ తో అనూహ్యంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని ఉద్భోధించారు. కాంగ్రెస్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు బెదిరిస్తారని , వారి బెదిరింపులకు బయపడ కుండా ఎన్నికల్లో స...

టీఏసీ ముందుకు 'సీతారామ’ దస్త్రం

Image
  అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల అవసరమైన దస్త్రాలతో ఢిల్లీకి అధికారులు సవరించిన అంచనాలను అనుమతించాలని సీఎంకు లేఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తి పోతలు , సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దాదాపు10 లక్షల ఎకరాలకు  సాగునీరు , త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మంత్రి తుమ్మల కృషి ఫలితంగా సీతారామ సీతమ్మ సాగర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు (డీపీఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల దస్త్రం ఎట్టకేలకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ముందుకు చేరింది. దీంతో మంగళవారం ఢిల్లీలో ఈ ప్రాజెక్టుకు సంబధించిన కీలక అనుమతులపై టీఏసీ చర్చించింది. ఈ నేపధ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో గోదావరిపై సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి , బ్యారేజీ బ్యాక్ వాటర్ ఆధారంగా ఖమ్మం , మహబూబాబాద్ , భద్రాద్రి జిల్లాలకు సాగు , తాగు నీరు అందించే సీతారామ ఎత్తి పోతల పథకానికి టిఏసీ అన...

ఎల్ కటింగ్ ... మిర్చి మార్కెట్లో ఇదో మోసం

Image
ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్లో కొత్త రకం దోపిడీ కటింగ్ చేసిన బస్తాలను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి మోసం జరగనీయమన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంత రావు సోమవారం ఒక్క రోజే మార్కెట్ కు వచ్చిన లక్ష బస్తాల మిర్చి   ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి ... ఆరుగాలం పడ్డ శ్రమ ... ఎన్నో కుటుంబ అవసరాలు ... అన్నీ వ్యాపారులు పెడుతున్న ‘ ఎల్ ’   కటింగులతో తుడుచు పెట్టుకు పోతున్నాయి. గంపేడాశతో వచ్చిన మిర్చి రైతు ఖమ్మంవ్యవసాయ మార్కెట్లో దళారుల సరికొత్త మోసానికి బలై పోతున్నాడు. కమీషన్ ఏజెంట్లు , కొనుగోలుదారులు చేస్తున్న ఈ నిలువు దోపిడీకి రైతు నోట మాట రావడం లేదు. సాధారణంగా తాలు , తేమ , మచ్చ వల్ల మార్కెట్లో మిర్చికి ఆశించిన ధర రాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ , బస్తాలపై కొనుగోలు దారులు పెడుతున్న ‘ ఎల్ ’ కటింగుల వల్ల ఇప్పుడు మిర్చి ధర పలకడం లేదు. మిర్చి బస్తాలపై వ్యాపారులు పెడుతున్న ఈ కోతలు రైతుల ఆశలను కత్తిరించేస్తున్నాయి. అసలే , ఈ ఏడాది మార్కెట్లో మిర్చికి ధర లేదు. గతేడు ఇదే సీజన్లో రూ. 20 వేలకు పైగా పలికిన మిర్చి ధర , ఇప్పుడు రూ.13 నుండు 14 వేల మధ్యే దోబూచులాడుతోంది. అది కూడా పూర్తిగా ఎండిన క్వా...