కొత్త కలెక్టర్ మానవత్వం ...


భద్రాద్రి కొత్తగూడెం : బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు ఒక రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటొ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ ... ఆటొలో ప్రయాణిస్తున్న నలుగురికీ గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ పాటిల్ తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మానవతా దృక్పదాన్ని పలువురు ప్రశంసించారు.






Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే