కొత్త కలెక్టర్ మానవత్వం ...
భద్రాద్రి కొత్తగూడెం : బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్
వి పాటిల్ తన మానవత్వం చాటుకున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక క్రాస్ రోడ్ వద్ద
ఈ రోజు ఒక రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటొ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్
పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ ... ఆటొలో ప్రయాణిస్తున్న నలుగురికీ గాయాలయ్యాయి. అదే సమయంలో
అటుగా వెళ్తున్న కలెక్టర్ పాటిల్ తన వాహనాన్ని ఆపి గాయపడిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి
తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మానవతా దృక్పదాన్ని పలువురు ప్రశంసించారు.
Comments
Post a Comment