Posts

Showing posts from May, 2024

రెండవ ప్రాధాన్యతే ... కీలకం

Image
ఉమ్మడి ఖమ్మ , నల్గొండ , వరంగల్ జిల్లాల పట్టభధుల నియోజక వర్గ ఎం‌.ఎల్‌.సి ఎన్నికలు చెదురు మొదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఓటర్లలో 72.37 శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఓట్లను మాత్రం జూన్ 5న లెక్కిస్తారు. ఆ తరువాత ఎవరు గెలిచారన్నది తేలడానికి రెండు , మూడు రోజులు పట్టోచ్చు. ఈ ఓట్ల లెక్కింపు అన్నది ఒక సుధీర్ఘమైన ప్రక్రియ . ఓట్లు వేసే పద్దతిలోనూ ... లెక్కించే విధానంలోనూ ... సాధారణ ఎన్నికలతో పోలిస్తే ... చాలా తేడా వుంటుంది. అందుకే ఈ ఎన్నికలకు ఈవీఏంలు కాకుండా బ్యాలెట్లు వాడారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలోనూ ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధినే విజేతగా ప్రకటిస్తారు. కానీ ...   ఆ అభ్యర్ధికి పోలైన ఓట్లలో 50 శాతం కన్నాఒక్క ఓటైనా ఎక్కువ రావాలి. అంటే ... పోలైన ఓట్లలో సగం ఓట్లు వచ్చినా సరిపోదు అదనంగా మరో ఓటు రావాలి. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఒకే. నాకు తెలిసి ... కేవలం మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ... అంతకు ముందు ఉమ్మడ...

పొంగులేటిపై లేఖాస్త్రం

Image
తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఓ లేఖ విడుదలైంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈ లేఖను విడుదల చేశారన్న భావన కలిగేలా ఈ లేఖను డ్రాఫ్ట్ చేశారు. లేఖ చివర ఏడుగురి పేర్లున్నా ... సంతకాలు మాత్రం చేయలేదు. కంప్యూటర్ లో కొంపోస్ చేసిన లేఖను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజ స్వరూపం చూడండంటూ విడుదల చేశారు. ఈ లేఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై పొంగులేటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతను కమ్మ వాళ్ళకు వ్యతిరేకం అంటూ లేఖను ప్రారంభించి ... కమ్మ వాళ్ళ సత్తా నిరూపించి నిలబడదాం ... కలబడదాం అంటూ ముగించారు. మధ్యలో పొంగులేటిపై తీవ్రమైన విమర్శలు ... ఆరోపణలు చేశారు. 1995లో కల్లూరులో పాలమ్ముకొనే వాడని ... మొదట తుమ్మల లక్ష రూపాయల కాంట్రాక్టు ఇచ్చాడని రాసుకొచ్చారు. నామ నాగేశ్వర రావు 60 యేళ్ళు సంపాదించలేనిది ... పదేళ్ళలో పదివేల కోట్లు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. రానున్న ఇదేళ్లలో ఆర్ఆర్ఆర్ ప్రక్కనవెయ్యి ఎకరాలు , 2 లక్షల కోట్లు మింగడానికి సిద్దమైండని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పదవుల్లో కమ్మ వాళ్ళను లేకుండా చేశాడని ... ఇప్పటి...

ఆ పదవి బట్టికే ... దక్కే అవకాశమెంత ?

Image
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం టి.‌పి.‌సి.‌సి నూతన అధ్యక్షుణ్ణి నియమించే అవకాశంవుంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ పదవిని  ఎవరికిస్తే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పి‌సి‌సి అధ్యక్షుడిగా వున్న సి‌ఎం రేవంత్ రెడ్డి ఇక పాలనపై పూర్తి స్థాయిలో ధృష్టి పెట్టేందుకు వీలుగా వెంటనే కొత్త చీఫ్ ను నియమించాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలున్నారు. అయితే ... రేవంత్ రెడ్డికి సహకరిస్తూ పార్టీని సమర్ధవంతంగా నడపగలిగే వారి కోసం వెదుకుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో ... ఈ పదవి కోసం అరడజను మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా  ప్రస్తుత డిప్యూటీ సీ‌ఎంగా వున్న మల్లు బట్టి విక్రమార్క ఈ పదవిని తనకు ఇవ్వాలని చాలా కాలంగా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కడికే జోడు పదవులు ఇచ్చే అవకాశం లేదని కొందరు అంటుంటే ... కర్నాటక డిప్యూటీ సీ‌ఎంగా వున్న డీకే శివ కుమార్ ఆ రాష్ట్ర పి‌సి‌సి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో ... తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం బట్టికే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముందని మరికొందరంటున్నారు. కానీ ... పార్...

కాంగ్రెస్ కు ఓటు తో బుద్ది చెప్పాలి

Image
👉 మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు 👉 ఈ సీటు మళ్లీ బీఆర్ఎస్దే 👉 ప్రతి గ్రాడ్యుయేట్ గడప తట్టండి 👉 కాంగ్రెస్ పాలన వద్దంటున్న ప్రజలు 👉 ఓటనే ఆయుధంతో నిద్రపోతున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి 👉 హైదరాబాద్ విషయంలో కుట్రలు 👉 హైదరాబాద్ లేని తెలంగాణా తల లేని మొండెం లాంటిది 👉 మళ్లీ మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజదానిగా చేసే కుట్ర గ్రాడ్యుయేట్ సోదరులు తమ ఓటే ఆయుధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టభద్రులకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్ది ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం   సత్తుపల్లి , బోనకల్ లో పట్ట భద్రులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో వచ్చిన రాకేష్ రెడ్డిని దండిగా దీవించి , ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే నేను అసెంబ్లీలో , ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడతామని చెప్పారు. ఎప్పుడూ బీఆర్ఎస్ గెలిచే ఈ సీటును మళ్లీ బీఆర్ఎస్సే గెలవబోతుందని స్పష్టం చేశారు. సమయం తక్కువుగా ఉన్నందున ప్రతి గ్రాడ్యుయేట్ గడప తట్టి , ఓట్లు అడగాలని అన్నారు. ఆరు ...