Posts

Showing posts from October, 2024

భద్రాచలం కాంగ్రెస్ లో బగ్గుమన్న విబేధాలు

Image
          వీధిన పడ్డ పోదెం , తెల్లం వర్గాల మధ్య ఆధిపత్య పోరు         దుమ్ముగూడెం మండలంలో తెల్లానికి వ్యతిరేకంగా ప్లెక్షీలు       ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుతో బయట పడ్డ అసంతృప్తి ఒక్క సారిగా భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే , రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య , స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మధ్య కొంత కాలంగా ఏర్పడ్డ అగాధం కాస్త , వివాదంగా మారి వీధిన పడింది. దుమ్ముగూడెం మండలంలోని ములక పాడు సెంటర్ , నర్సాపురం , లక్ష్మీ నగరంలో ఎమ్మెల్యే తెల్లంకు వ్యతిరేకంగా ప్లెక్షీలు వెలిశాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమక్షంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ పలు చోట్ల ప్లెక్షీలు పెట్టారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికే ఇందరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకూ నివురు గప్పిన నిప్పుగా వున్న వర్గ పోరు , ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సందర్భంగా బగ్గు మనడం భద్రాచలం నియోజక వర్గంలో ఇప్పు...

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి

Image
            పోలీసుల సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు         గంజాయి సేవించే వారిపైనా కేసులు పెట్టాలని ఆదేశం           సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన     మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా వుంటూ ,  వారి కదిలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో నెల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గుట్కా , మట్కా , జూదం , బెట్టింగు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి , చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల ఖాతాల...

ఈ గోడ ఎక్కడి వరకు ?

Image
          40 ఏళ్లలో మున్నేటికి ఎన్నడూ లేనంత వరద           రక్షణ గోడల డిజైన్ మార్చే పనిలో అధికారులు          దంసలాపురం వరకూ నిర్మించాలంటున్న బాధితులు ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంపు నుండి కాపాడేందుకు ప్రభుత్వం రక్షణ గోడలు నిర్మిస్తోంది. పోలేపల్లి నుండి ప్రకాష్ నగర్ వరకూ 7.5 కిలో మీటర్ల మేర ఏటికి ఇరు వైపులా ఈ గోడలు నిర్మిస్తున్నారు. కానీ , సెప్టెంబర్ 2న మున్నేటికి వచ్చిన భారీ వరద , రక్షణ గోడల నిర్మాణానికి అధికారులు గతంలో వేసిన అంచనాలను , రూపొందించిన ప్రతి పాదనలను తల్ల క్రిందులు చేసింది. కొత్త అంచనాలను , ప్రతి పాదనలను రూపొందించాల్సిన అవసరం వచ్చింది. తాజాగా మున్నేరు కొచ్చిన వరదకనుగుణంగా నిపుణులు , జిల్లా అధికారులు తిరిగి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందిస్తున్నారు. రానున్న వందేళ్ళలో వరదల వల్ల నగరానికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా రక్షణ గోడలను రీడిజైన్ చేస్తున్నారు. ఎప్పటి కప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందుకు తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే , ఇప్పుడు కొత్త డిమాండ్ ఒకటి తెర పైకి వచ...