Posts

Showing posts from January, 2026

చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు

Image
తొలిసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావాహులు తమ తలరాతలు మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటించిన చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు గతంలో ఉన్న రిజర్వేషన్లకు పూర్తి భిన్నంగా ఉండటంతో గతంలో ఆ అవార్డుల్లో పోటీ చేసిన వారు ప్రస్తుతం వేరే వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా చైర్మన్ పదవి కూడా గత రెండు పర్యాయాలు ఎస్సి మహిళకు రిజర్వుడ్ కాగా తొలిసారిగా జనరల్ మహిళలకు కేటాయించడంతో మధిర మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. కోర్టుల తీర్పులకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనతో మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను 11 వార్డులు రిజర్వేషన్ పోగా మరో పదకొండు వార్డులు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించారు. అయితే గతంలో జనరల్ గా ఉన్న 9,10 వార్డులు ఎస్సీలకు కేటాయించగా గతంలో ఎస్సీ కి రిజర్వుడుగా ఉన్న 11,12 వార్డులు ప్రస్తుతం జనరల్ కు మారాయి. గత ఎన్నికలలో జనరల్ గా ఉన్న13,14,15 వార్డులు ప్రస్తుతం బీసీలకు కేటాయిం...

చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు

Image
చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు మధిర అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు మంచిది క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అని పనిచేసే వారిని గెలిపించుకోవాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు  ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల వారు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను...

అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు

Image
భట్టి ప్రోద్బలంతోనే అక్రమ కేసులు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, లేదంటే ఉద్యమం ఉదృతం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రోత్బలంతోనే మధిర, బోనకల్, చింతకాని మండలాలలో పోలీసులు సిపిఎం పార్టీ కార్యకర్తలపై వాస్తవాలకి విరుద్ధంగా అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మధిర పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వెంటనే వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడు గ్రామంలో సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్న హంతకులు ఎవరో పోలీసులకు తెలిసిన తెలియనట్లు నటిస్తూ, హంతకుల కోసం కుటుంబ సభ్యులను పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధించటం ఏమిటని ప్రశ్నించారు. గడిచిన పంచాయితీ ఎన్నికల...