ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందును నిషేధించాలి : ఎంపీ రఘురాం రెడ్డి

MP Raghuram Reddy

తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్గడ్డి మందును నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కేంద్ర ప్రభుత్వం దీనిని వెంటనే నిషేధించాలని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బుధవారం 377 నిబంధన కింద ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు, యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందన్నారు.

60కి పైగా దేశాల్లో నిషేధం

పారాక్వాట్ పై 60 కి పైగా దేశాలు నిషేధం విధించాయని తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందన్నారు. గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలను గుర్తించారని, ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది ప్రమాదకరమన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి, క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డి మందు నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య మన వ్యవసాయాన్ని, సమాజ గౌరవాన్ని నిల బెడతాయని ఎంపీ రఘురాం రెడ్డి పేర్కొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే